Skip to main content

Posts

Showing posts from April, 2016

MM hospitals kadapa 2014 AD

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

లిఫ్ట్ లో వెక్కిరి వేసాడు చూడ౦డి ...?

రాత్రి 9.30 సమయంలో లిఫ్ట్ లో ఒంటరిగా ఉన్న యువతి. దీన్ని అదునుగా భావించి అసభ్యకరంగా ప్రవర్తించాడో యువకుడు. ముందు ఎంతగానో ఓపిక పట్టి తర్వాత ఆమె కోపానికి కుప్పకూలిపోయాడు ఆ ఆకతాయి. వివరాలు.. లిఫ్ట్‑ లో చైనాకు చెందిన యువతి ఒంటరిగా ఉంది. అదే సమయంలో ఓ యువకుడు లిఫ్ట్ లో ప్రవేశించాడు. యువతి ఫోన్తో బిజీగా ఉన్నసమయంలో మొదట ఆమెకు దగ్గరగా వచ్చాడు. గమనించిన ఆమె ఏమీ అనకుండానే పక్కకు తప్పుకుంది. ఆ యువకుడు మరోసారి వెనక వైపుగా వచ్చి ఈ సారి ఏకంగా చేయిని యువతి భుజం పై వేశాడు. ఈ హఠాత్పరిణామంతో చిర్రెత్తుకొచ్చిన యువతి ఒక్క సెకన్ కూడా వేస్ట్ చేయకుండా ఆ కామాంధుడి చేయి తీసేసి, మోహంపై నుంచి ఒక్క గుద్దు గుద్దింది. అంతేనా చెప్పరాని చోట కాలుతో గట్టిగా ఓ తన్ను తన్ని అతను కిందికి వంగగానే మోహం పైనుంచి గట్టిగా కాలితో ఓ కిక్ ఇచ్చింది. అంతే ఆ యువకుడు లిఫ్ట్‑ లో కుప్పకూలిపోయాడు. ఈ నెల 24వ తేదీన జరిగిన ఈ సంఘటనకు సంబంధించి సీసీటీవీలో రికార్డయిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు .. సదరు యువతి దైర్యసాహసాలను కొనియాడుతున్నారు.    for this video click here to see what happen ...

పాముకాటుకు 45 వేలమంది మృతి...?

  పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోతున్న భారతీయుల సంఖ్య ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. ఎందుకంటే ప్రతియేటా పాముకాటుకారణంగా చనిపోతున్నవారు ఒక్కరు ఇద్దరు కాదు.. ఏకంగా 45 వేలమంది. ప్రతి ఏడాది 45 వేలమంది పాముకాటుకారణంగా చనిపోతుండగా.. దాదాపు 2లక్షలమంది అంగ విచ్ఛేదనానికి గురవుతున్నారు. ది ఇంటరాక్షన్ అనే కార్యక్రమ నిర్వాహకులు ఈ విషయాన్ని తెలిపారు. ఇది అంత తేలికగా తీసుకోవాల్సిన అంశం కాదని హెచ్చరించారు. పాముకాటుకు గురైన వారిల్లో ఏడుగురులో ఒక్కరు మాత్రమే ఆస్పత్రికి చేరగలుగుతున్నారని, అప్పటికీ ఆలస్యం కారణంగా వారు ప్రాణాలువిడుస్తున్నారని తెలిపారు. ఎక్కువమంది పొలాల్లో పనులకు నిమగ్నమై ఉన్నప్పుడే ఈ ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, నిర్లక్ష్యం, సౌకర్యాలు, మౌలిక వసతుల ఏర్పాట్ల లేమి వల్ల పాముకాటుకు గురైన వారు ప్రాణాలుకోల్పోవల్సి వస్తుందని చెప్పారు. ఈ ఏడాది ప్రారంభంలో మహారాష్ట్రలోని అంధరి టైగర్ రిజర్వకు సమీపంలో చిరాగ్ రాయ్ అనే వ్యక్తి పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇతడు పాముల విషయంలో నిపుణుడు అయినప్పటికీ ఆస్పత్రికి చేరుకునేలోగానే ప్రాణాలుకోల్పోయాడు. అందుకు ప్రధాన కారణం దేశంలోనే అత్...

విడుదలకానున్న బహుబలి...!

  తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా నిరూపించిన బ్లాక్ బస్టర్ మూవీ 'బాహుబలి'. ఈ మూవీ వచ్చే జూన్ 8న ఫ్రాన్స్ లో విడుదల కానుంది. ఈ మేరకు బాహుబలి పేరుతో ఉన్న అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. జేసూస్ బాహుబలి అనే పేరుకు హ్యాష్ ట్యాగ్ పెట్టి, 'బాహుబలి - ది బిగినింగ్' విడుదల వివరాలను పోస్ట్ లో పేర్కొన్నారు.  ఈ సినిమా విడుదలకు ముందు నుంచే ఎన్నో సంచలనాలు నమోదు చేస్తూ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో బాహుబలి విడుదలై రికార్డుల వర్షం కురిపించింది. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టెర్ ఎస్.ఎస్.రాజమౌళి ప్రస్తుతం ఈ మూవీ రెండో భాగం షూటింగ్స్ లో బిజిగా ఉన్నాడు. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా, నాజర్, సత్యరాజ్ కీలకపాత్రలు పోషించిన ఈ మూవీ ఫ్రాన్స్ లో విడుదలై మరిన్ని విజయాలు సాధిస్తుందని ఆ మూవీ యూనిట్ భావిస్తుంది. When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS an...

నిన్ను చూసి గర్వపడుతున్నాం...!!!

సాధారణంగా తెలుగు సినిమాల్లో ఎక్కువశాతం పరభాషా నటులు విలన్లుగా దర్శనమిస్తుంటారు. అచ్చంగా అలానే పరభాషా చిత్రంలో మన తెలుగు నటుడు విలన్ గా నటించి సత్తా చాటాడు. దాంతో ప్రస్తుతం అతడు 'టాక్ ఆఫ్ ద టాలీవుడ్' అయ్యాడు. తెలుగు యువ హీరో సుధీర్ బాబు తొలిసారి బాలీవుడ్ మూవీ 'భాగీ' లో నెగటివ్ రోల్ లో నటించి అందరి మన్ననలు అందుకుంటున్నాడు. సుధీర్ అభినయానికి తోటి నటీనటుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రెజీనా, రకుల్ ప్రీత్ సింగ్, మంచులక్ష్మీ, సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్, ఆండీ శ్రీనివాసన్లు సధీర్ బాబుతో కలిసి భాగీని వీక్షించారు. 'సుధీర్ బాబు నిన్ను చూసి గర్వపడుతున్నాము. భాగీలో నీ నటన అద్భుతం. నీతో కలిసి భాగీని థియేటర్ లో చూడటం ఎంతో ఆనందాన్నిచ్చింది' అని మంచు లక్ష్మి ట్వీట్ చేశారు.  టైగర్ ష్రాఫ్, శ్రద్ధాకపూర్ లు హీరో హీరోయిన్ లుగా నటించిన భాగీ చిత్రంలో విలన్ రోల్ లో సుధీర్ బాబు అలరించారు. శుక్రవారం విడుదలైన భాగీ ఈ ఏడాది విడుదలైన బాలీవుడ్ సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన మూడో చిత్రంగా నిలిచింది. షబ్బీర్ ఖాన్ దర్శకత్వంలో సాజిద్ నడియాడ్వాలా ఈ సినిమాను నిర్మిం...

ఈ మధ్యే ప్రేమలో పడ్డాను..!!!

  పాకిస్థాన్ నాటకాలకు(సీరియల్స్) ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఫిదా అయిపోతోంది. అక్కడి నాటకాలు తనను కట్టిపడేస్తున్నాయని, వాటితో ప్రేమలో పడిపోయానని చెబుతోంది. పాకిస్థాన్ కు చెందిన డ్రామాల రచన శైలి, నిర్మాణ విలువలు, మేకప్, నటన అద్భుతంగా ఉంటాయని తెగ పొగిడేస్తోంది. ముఖ్యంగా అక్కడి నటుల నటన చాలా అద్భుతంగా ఉంటుందని, వాస్తవికంగా ఉంటాయని తెలిపింది. 'రాత్రి వేళ షూటింగ్ కార్యక్రమాలు ముగించుకొని వస్తున్న నేను ఈ మధ్య కొత్తగా ఒక అలవాటు నేర్చుకున్నాను. దాన్ని ఇష్టపడుతున్నాను కూడా. పొద్దున్నే లేవగానే.. ఈ మధ్య జిందగీ అనే చానెల్ చూస్తున్నాను. అందులో ముఖ్యంగా కాంకర్ అనే సీరియల్ అయితే నన్ను కట్టిపడేస్తోంది. దానికే వేలాడుతున్నాను. మేరి హర్జాయ్, ఏక్ మోహబ్బత్ కే బాద్ డ్రామాల రచన శైలి అద్బుతంగా ఉంది. ఇలాంటి టీవీ చూడటం నిజంగా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఫిమేల్ క్యారెక్టర్లు తెగనచ్చుతున్నాయి. అవి చాలా బాగా ఉన్నాయి' అని విద్యా చెప్పింది. When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by sh...

మూవీ రివ్యూ: 'వర్షం' రీమేక్ ఇలా ఉంది...!

  టైటిల్: భాగీ లేదా బాగీ జానర్: రొమాంటిక్ యాక్షన్ నటీనటులు: టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్, సుధీర్ బాబు, సునీల్ గ్రోవర్ తదితరులు డైరెక్టర్: షబ్బీర్ ఖాన్ నిర్మాత: సాజిద్ నడియావాలా రచన: సంజీవ్ దత్త్ నిడివి: 2 గంటల 16 నిమిషాలు విడుదల: ఏప్రిల్ 29, 2016 2015 మే నుంచి 2016 ఫిబ్రవరి వరకు యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ చుట్టూ 50 మంది ప్రత్యేక ప్రైవేట్ సెక్యూరిటీ పర్సన్స్ 24x7 కాపలా కాశారు. ఆ టైమ్ లో షూటింగ్ జరుపుకొన్న భాగీ సినిమాకు సంబంధించి ఒక్కస్టిల్ గానీ, టైగర్ లుక్ గానీ లీక్ కాకూడదని నిర్మాత సాజిద్ నడియావాలా  అంత జాగ్రత్త తీసుకున్నారు. టైగర్  ఎలా కనిపిస్తాడో, ఏం చేస్తాడో సగటు ప్రేక్షకుడు 'అన్నీ హాల్లోనే' తెలుసుకోవాలని ఆయన ఉద్దేశం. అనుకున్నట్లే టైగర్ ష్రాఫ్ ఈ సినిమాలో ఫైట్ లు ఇరగదీశాడు. అంతేనా? ఇంకేం చెయ్యలేదా? అంటే.. మళ్లీ మళ్లీ ఫైట్లే చేస్తాడు. మొదట్లో, చివర్లో, మధ్యమధ్యలో హీరోయిన్ ని ప్రేమిస్తాడు కూడా! 'యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, త్రిషల కెరీర్ లను మలుపు తిప్పిన హిట్ సినిమా వర్షం (2004) రీమేకే ఈ హిందీ భాగీ' అని మనం అన్నా, అనుకున్నా.. సినిమాకు సంబంధించినవాళ్లు మాత్రం ఒ...

జీతం రూ. 66, భద్రత వ్యయం రూ. 84 కోట్లు...!

   ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు, ప్రస్తుత సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌ ఏడాదికి కేవలం ఒక్క డాలర్.. అంటే సుమారు 66 రూపాయల జీతం మాత్రమే తీసుకుంటారు. కానీ, ఆయన భద్రత కోసం ఫేస్‌బుక్ గత మూడేళ్లుగా వెచ్చించిన మొత్తం ఎంతో తెలుసా.. దాదాపు రూ.84 కోట్లు. ఆదాయంలో దూసుకుపోతూ, సంస్థను అగ్రగామిగా నిలుపుతున్న తమ అధిపతి కోసం ఫేస్ బుక్ భారీ మొత్తంలో ఖర్చు పెడుతోంది. సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈవో, బిలియనీర్ మార్క్ జుకర్ బర్గ్  (31) రక్షణకు అవుతున్న వ్యయాన్ని  ఫేస్ బుక్  తొలిసారిగా  వెల్లడించింది. ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ నుంచి వస్తున్న బెదిరింపుల నేపథ్యంలో 24 గంటలు ఆయనను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఆయన భద్రత కోసం కోట్లాది రూపాయలను కేటాయిస్తోంది. ఈ నేపథ్యంలో 2013 నుంచి 2015 వరకు జుకర్‌బర్గ్ సెక్యూరిటీ కోసం సుమారు 84 కోట్ల రూపాయలను వెచ్చించినట్టు ఫేస్‌బుక్ ఓ నివేదికలో పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను రక్షించినట్లు గానే సీక్రెట్ సర్వీసెస్ సంస్థ జుకర్‌బర్గ్ భద్రతను పర్యవేక్షిస్తోంది. శాన్ ఫ్రాన్సిస్కోలో నివసిస్తున్న జుకర్‌బర్గ్‌ భద్రత కోసం అమెజాన్, యాపిల్ లాంటి స...

స్వర్గసుఖాలను చూపిస్తా...?

  బెంగళూరు: హైదరాబాద్‌కు చెందిన ఓ ‘కాల్‌గర్ల్’ బెంగళూరులో తమిళనాడుకు చెందిన పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడిని బురిడీ కొట్టించింది. స్వర్గసుఖాలను చూపిస్తానని చెప్పి అతన్ని నిలువుదోపిడీ చేసింది. బాధితుడి స్నేహితుడి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం సదరు నాయకుడితో పాటు అతని స్నేహితుడు కూడా పోలీసులకు అందుబాటులో లేక పోవడం గమనార్హం. వివరాలు...తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడొకరు  వ్యాపార సంబంధ పనుల పై ఈనెల 25న బెంగళూరుకు వచ్చారు. చామరాజనగర్‌కు చెందిన రిత్విక్ శెట్టి సదరు నాయకుడికి బెంగళూరు ఓల్డ్ ఎయిర్‌పోర్ట్‌రోడ్‌లో ఉన్న ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో రాజా పేరుతో రూమ్ బుక్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఓ కాస్ట్లీ కాల్‌గర్ల్‌ను కూడా విమానంలో రప్పించి ఆయన చెంతకు చేర్చారు. సదరు కాల్‌గర్ల్ తన దగ్గరకు వెచ్చిన వెంటనే ‘తమిళనాడు నాయకుడు’ హోటల్‌లోని తన రూంకు తీసుకువెళ్లారు.  కొద్ది సేపటి తర్వాత  మద్యం తీసుకురావడానికి సదరు నాయకుడు హోటల్ రూమ్ నుంచి బయటికి వచ్చారు. ఇరవై నిమిషాల తర్వాత మద్యం తీసుకుని రూమ్‌కు వెళితే అక్కడ హైదర...

దొంగ దొంగది సినిమా చూసారా మల్లి చుడండి ...?

   ► యజమాని ఇంట్లోనే చోరీ చేసిన ఉద్యోగి ► సీసీ కెమెరాలకు చిక్కకుండా బుర్ఖా ధారణ ► కుడికాలులో ఉన్న ఇబ్బందితో దొరికిన లీడ్ ► 48 గంటల్లో ఛేదించిన నాంపల్లి పోలీసులు ఈ రెండు ఫొటోల్లో ఉన్నది ఒక్కరే...చోరీ కోసం  ‘ఆడ’ వేషం వేసిన ఓ దొంగ దర్జాగా చోరీ చేసి బయటకొచ్చాడు. చివరకు నాటకీయంగా పోలీసులకు చిక్కాడు. ఖైరతాబాద్: పని చేస్తున్న సంస్థ యజమాని ఇంట్లోనే చోరీ చేశాడు... సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా ఉండేందుకు బుర్ఖా ధరించాడు...శిరస్సు మొదలు సిరిపాదం వరకు అన్నీ కప్పేసుకున్నాడు. అయినప్పటికీ ‘నడకలో’ ఉన్న తేడాతో అనుమానితుడిగా మారాడు. అదపులోకి తీసుకుని విచారించడంతో నేరం అంగీకరించాడు... నాంపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో మంగళవారం నమోదైన 44 తులాల బంగారం చోరీ కేసు నిందితుడి వ్యవహారమిది. ఈ కేసును 48 గంటల్లో ఛేదించిన పోలీసులు బంగారం మొత్తం రికవరీ చేశారు. ఇన్‌స్పెక్టర్ మధుమోహన్‌రెడ్డితో కలిసి శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మధ్య మండల డీసీపీ వీబీ కమలాసన్‌రెడ్డి పూర్తి వివరాలు వెల్లడించారు. ఎక్కడ? ఏం జరిగింది? లక్డీకాపూల్‌లోని ఎక్స్‌ప్రెస్ అపార్ట్‌మెంట్‌లో నివసించే శ్రీకాంత్...

ప్రేమించి మూడు నెలల ముచ్చట చేశాడు..?

  ► చలివిడి చేసి అత్తారింటికి పంపితే శవమై వచ్చింది ► ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నందుకే చంపేశారు ► కూతురు మృతిపై న్యాయం చేయాలని రోదిస్తున్న తల్లి గుడివాడ : పెళ్లి చేసుకుని మూడు నెలల ముచ్చట తీరకముందే తన బిడ్డను చంపేశారు. అత్తారింటికి వెళ్లాలంటే చలివిడి చేసి పంపాను.. ఇంటికెళ్లి అరగంట గడవక ముందే శమైందని కబురు వచ్చింది. నా బిడ్డను నిలువునా బలి తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గుడివాడ ఏరియా ఆస్పత్రి ఎదుట ఆ తల్లి రోదిస్తున్న తీరు అందరినీ కంట తడి పెట్టింది. గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడ గ్రామంలో వివాహిత మృతి చెందిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అత్తారింటికి వెళ్లిన అరగంటకే అస్వస్థత గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు గ్రామానికి చెందిన కొణతం ఆంజనేయులు కుమారుడు కొణతం లీలా శోభన్‌కుమార్ అదే గ్రామానికి చెందిన కట్టా మాణిక్యం కుమారై కృష్ణకుమారిలు కొంతకాలంగా ప్రేమించుకున్నారు. అయితే శోభన్‌కుమార్‌కు తల్లిదండ్రులు వేరొక యువతితో పెళ్లికి సిద్ధం చేయడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 5న శోభన్ తన ప్రియురాలు కృష్ణకుమారిని తీసుకెళ్లి ద్వారకాతిరుమలలో వివాహం చేసుకున్నాడు. అయితే శోభన్‌కుమార్ తల్లిదండ్రులకు...

నటి వింద్యపై చెప్పులతో దాడి...?

  టీనగర్: తిరువారూరు సమీపాన నటి వింద్య ఎన్నికల ప్రచారం చేస్తుండగా అన్నాడీఎంకే కార్యకర్తలు చెప్పులు విసరడంతో సంచలనం ఏర్పడింది. తిరువారూరు జిల్లా, నన్నిలం నియోజకవర్గంలో రెండవ సారిగా పోటీ చేస్తున్న మంత్రి కామరాజ్‌కు మద్దతుగా వలంగైమాన్, కుడవాసన్, నన్నిలం ప్రాంతాలలో నటి వింద్య బుధవారం రాత్రి ప్రచారం చేశారు. నన్నిలం బస్టాండు సమీపాన జరిగిన ప్రచార సభలో అక్కడ అన్నాడీఎంకే వర్గాలు గుమికూడాయి. ఆ సమయంలో రాత్రి 9.55 గంటలకు అక్కడికి వచ్చిన వింద్య సమయం మించిపోవడంతో తాను మాట్లాడలేనని, క్షమించాలని కోరుతూ తన ప్రసంగాన్ని ఆపారు. దీంతో ఆగ్రహించిన కార్యకర్తలు కొందరు వింద్యను ఏకపదజాలంతో మాట్లాడారు. కొందరు ఆమెపై పాదరక్షలు విసిరారు. దీంతో అన్నాడీఎంకే వర్గాల మధ్యే ఘర్షణ ఏర్పడింది. దీన్ని అక్కడున్న వీడియో, ఫోటోగ్రాఫర్లు చిత్రీకరించేందుకు ప్రయత్నించగా విద్యుత్ సరఫరా నిలిపివే శారు. దీంతో నటి వింద్య అక్కడి నుంచి దిగాలుగా వెళ్లిపోయింది. When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners o...

లయన్స్ ‘సిక్సర్’...!!!

  ► గుజరాత్‌కు ఆరో విజయం ►  భారీ లక్ష్యాన్ని ఛేదించిన రైనా జట్టు ► దుమ్మురేపిన మెకల్లమ్, డ్వేన్ స్మిత్ ► పుణేకు తప్పని ఓటమి  స్మిత్ సెంచరీ వృథా పుణే: ఆఖర్లో ఉత్కంఠ చోటు చేసుకున్న మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్ పైచేయి సాధించింది. 12 బంతుల్లో 20 పరుగులు చేయాల్సిన దశలో నాలుగు కీలక వికెట్లు చేజార్చుకున్నా గట్టెక్కింది. దీంతో ఐపీఎల్-9 సీజన్‌లో ఆరో విజయాన్ని సాధించింది. మరోవైపు స్లాగ్ ఓవర్లలో సరైన బౌలింగ్ చేయలేకపోయిన పుణే ఖాతాలో మరో పరాజయం చేరిం ది. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ 3 వికెట్ల తేడాతో పుణేపై గెలిచింది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పుణే 20 ఓవర్లలో 3 వికెట్లకు 195 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (54 బంతుల్లో 101; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో కదంతొక్కాడు. రహానే (45 బంతుల్లో 53; 5 ఫోర్లు), ధోని (18 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. తర్వాత గుజరాత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 196 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ డ్వేన్ స్మిత్ (37 బంతుల్లో 63; 9 ఫోర్లు, 1 సిక్స్), మెకల్లమ్ (2...

నేను ఓటు వేయను.. కమల్ ...?

  రానున్న ఎన్నికలలో నేను ఓటు వేయను అని విశ్వ నటుడు కమలహాసన్ అన్నారు. ఆయన జోక్‌గా అన్న విషయం కాదు. పత్రికా ముఖంగానే చెప్పారు. కమలహాసన్ నటిస్తూ, రాజ్‌కమల్ ఇంటర్‌నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రం శభాష్‌నాయుడు. తమిళం, తెలుగు, హిందీ భాషలలో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్ర నిర్మాణంలో లైక్ ప్రొడక్షన్ భాగస్వామ్యం పంచుకుంటోంది. ప్రముఖ మలయాళ దర్శకుడు టి.కె.రాజీవ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కథానాయకిగా శ్రుతిహాసన్ నటించడం విశేషం. ముఖ్యపాత్రలో రమ్యకృష్ణతో పాటు బ్రహ్మానందం సౌరభ్‌శుక్లా, ఆనంద్ మహాదేవ్, భరత్‌బహుండల్, ఫరిదాజలాల్, సిద్ధిక్, మనునారాయణన్ తదితరులు నటిస్తున్నారు. చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం ఉదయం స్థానిక టి.నగర్, హబీబుల్లా రోడ్డులోని నడిగర్ సంఘం ఆవరణంలో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర టీజర్‌ను ప్రదర్శించారు. కార్యక్రమంలో కమలహాసన్, శ్రుతిహాసన్, దర్శకుడు టి.కె.రాజీవ్‌కుమార్, సంగీత దర్శకుడు ఇళయరాజా, లైక్ సంస్థ అధినేత సుభాష్‌కరణ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కమలహాసన్ విలేకరులతో మాట్లాడుతూ ఇది హ్యూమరస్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల...

ఇక కంప్యూటర్లు ఉండవు..!

   గూగుల్ బ్లాగ్‌లో సుందర్ పిచాయ్ లేఖ  న్యూయార్క్: భవిష్యత్తులో భౌతిక కంప్యూటర్లకు స్థానం ఉండదని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అంచనా వేస్తున్నారు. డివైస్ అనే భావనకు కాలం చెల్లుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కంప్యూటర్ భౌతికంగా కాకుండా ఏ రూపంలో ఉన్నప్పటికీ, మన రోజువారీ కార్యకలాపాల్లో ఇంటెలిజెంట్ అసిస్టెంట్‌గా సహాయపడుతుందని వివరించారు. స్మార్ట్‌ఫోన్ టచ్‌స్క్రీన్లకు బదులుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే రూపరహిత ఉత్పత్తులు పెరుగుతాయని తెలిపారు. మొబైల్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ప్రపంచంలోకి మారతామని వివరించారు. కొద్ది సంవత్సరాల క్రితం ఊహించని విధంగా ఇప్పుడు సర్వం స్మార్ట్‌ఫోనే అయ్యిందని పేర్కొన్నారు. రోజు వారీ జీవితానికి స్మార్ట్‌ఫోన్ రిమోట్ కంట్రోల్‌లా పనిచేస్తోందన్నారు. విద్యకు, వినోదానికి, కమ్యూనికేషన్‌కు, వినియోగానికి... అన్నింటికీ ప్రజలు స్మార్ట్‌ఫోన్‌నే  ఉపయోగిస్తున్నారని  పేర్కొన్నారు. వాయిస్‌తో సమాచారాన్ని సెర్చ్ చేయడం పెరుగుతుందని వివరించారు. అయితే ఇక ముందు డివైస్ స్థానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆక్రమిస్తుందని అన్నారు.  అత్యుత్తమ...

మాజీ ప్రియుడితో మళ్లీ..?

రణ్‌బీర్ కపూర్‌తో బ్రేకప్ అయ్యాక, సల్మాన్‌ఖాన్‌తో కత్రినా కైఫ్ మునుపటి స్నేహాన్ని మళ్లీ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. వ్యక్తిగత బంధాన్ని మాత్రమే కాదు.. వృత్తిపరమైన బంధాన్ని కూడా ఆమె కొనసాగించాలనుకుంటున్నారట. మళ్లీ ఈ కండలవీరుడితో సినిమాలు చేయాలనుకుంటున్నారని సమాచారం. సల్మాన్ కూడా క్యాట్‌తో జతకట్టడానికి ఉత్సాహంగా ఉన్నారట. తన తదుపరి చిత్రాల్లో కత్రినా కైఫ్‌ను కథానాయికగా తీసుకోమని దర్శక-నిర్మాతలతో అంటున్నారట. అనడమే కాదు.. ఒత్తిడి చేస్తున్నారని కూడా వినికిడి. తాజాగా ఆయన దర్శక-నిర్మాత కరణ్‌జోహార్‌తో సినిమా చేసే సన్నాహాల్లో ఉన్నారు. ఈ చిత్రంలో ఎలాగైనా కత్రినాను కథానాయికగా చేయించాలని సల్మాన్ అనుకున్నారట. కరణ్ జోహార్ కూడా అందుకు సిద్ధపడ్డారని భోగట్టా. చివరి నిముషంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను తీసుకోవాలనుకుంటున్నారట. సడన్‌గా తెరపైకి జాక్వెలిన్ ఎందుకు వచ్చింది? అనే విషయం బాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ ఆ పాత్రకు కత్రినా సూట్ కాదని సల్మాన్‌ని కరణ్ ఒప్పించి ఉంటారా? అనే దిశగా చర్చలు సాగుతున్నాయి. మరి.. కథానాయికగా ఎవరు నటిస్తారు? అనేది కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. Whe...

ఆర్ బి ఐ -RBI స్కాలర్షిప్ స్కీమ్నకు ప్రకటన...?

 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బిఐ)- ఎకనామిక్స్ ఫైనాన్స్ విభాగాలకు సంబంధించి ప్రజల్లో అవగాహనను పెంపొందిం చేందుకుగాను రూపొందించిన ప్రాజెక్టు కోసం ఉద్దేశించిన స్కాలర్షిప్ స్కీమ్నకు ప్రకటన విడుదల చేసింది. అర్హత: యుజిసి గుర్తింపు పొందిన సంస్థలు/ యూనివర్సిటీల్లో ఎకనామిక్స్/ ఫైనాన్స్ ప్రొఫెసర్లు, ఫైనాన్షియల్ ఎకనామిక్స్, బ్యాంకింగ్ రియల్ సెక్టార్ ఇష్యూస్లో రీసెర్చ్ చేస్తున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. స్కాలర్షిప్స్స్ ఎంపిక: వెయ్యి పదాలకు మించని రీసెర్చ్ ప్రపోజల్, ఇంటర్వ్యూ ద్వారా కాలపరిమితి; మూడు నెలలు దరఖాస్తుకు ఆఖరు తేదీ: మే 31 పూర్తి సమాచారం కోసం వెబ్ సైట్ చూడవచ్చు మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

చిరంజీవి 'కత్తి'లాంటోడు ప్రారంభం .,..!!

   హైదరాబాద్: 'కత్తి'లాంటోడు అంటూ  మెగాస్టార్ చిరంజీవి దూసుకొస్తున్నారు. ఆయన 150వ సినిమా  మధ్నాహ్నం 1.30 గంటలకు లాంఛనంగా ప్రారంభమైంది. వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ముహుర్తం షాట్ శుక్రవారం చిరంజీవి కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ క్లాప్ కొట్టగా,  అల్లు అరవింద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. విజయ్ తమిళంలో నటించిన కత్తి చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. జూన్ మొద‌టివారం నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఓ పాత్రలో మెరిపించనున్నట్లు తెలుస్తోంది. కాగా చిరంజీవి 2007 నుంచి సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన చివరిగా శంకర్ దాదా జిందాబాద్ లో నటించారు. అనంతరం రాజకీయల్లోకి ప్రవేశించి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. అయితే రాజకీయాల్లో అనుకున్నంతగా రాణించలేకపోయిన చిరంజీవి తాను స్థాపించిన  పీఆర్పీనీ 2011లో కాంగ్రెస్ లో విలీనం చేసిన విషయ...

టాప్ హీరోయిన్ తో వీధి వ్యాపారి పోటీ ...ఎవరు...!!!

   ఆమె దేశంలోనే టాప్ హీరోయిన్. అతను వీధుల్లో పండ్లమ్ముకునే చిరు వ్యాపారి. ఇప్పుడీ ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీ నడుస్తోంది. జిల్ జిగేల్ మెరుపులు తోడవడంతో సహజంగానే హీరోయిన్ ముందంజలో ఉంది. బతుకుపోరులో వెనుకపడిపోయిన ఆ వృద్ధ వ్యాపారి.. తారను నేలకు దించి, వెలిగిపోగలడా? నిద్రపోని నగరం ముంబైలో అడుగుకో మనిషి. మనిషి మనిషికో జీవితం. దానికో చరిత్ర. వాటిలో ఉత్తమమైనవాటిని పాఠకులకు అందిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఫాలోవర్లను సంపాదించుకుంది 'హ్యూమన్స్ ఆఫ్ ముంబై' ఫేస్ బుక్ పేజ్. 24 గంటల కిందట ఆ పేజ్ లో ఓ మామిడిపండ్ల వ్యాపారి మనోగతాన్ని ప్రచురించారు. కథనంలో వ్యాపారి మనోగతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ వ్యాపారి ఏమన్నారంటే.. 'ఫుట్ పాత్ మీద మామిడి పండ్లు అమ్ముకోవడమే నా జీవనాధారం. నేనే కాదు తరతరాలుగా మా కుటుంబం ఇదే వృత్తిలో కొనసాగుతోంది. అయితే అప్పటితో పోల్చుకుంటే మా పరిస్థితి దారుణంగా దిగజారింది. అదేం విచిత్రమో జనం ఇప్పుడు మా దగ్గర మామిడిపండ్లు కొనట్లేదు. హీరోయిన్ కత్రినా కైఫ్ టీవీల్లో చూపించినట్లు.. బాటిళ్లు కొనుక్కుని తాగుతున్నారు. బాటిళ్లలోని కెమికల్ రసాలతో పోల...

ప్రేమవివాహం చేసుకున్న రెండు నెలలకే.. .?

    పెళ్లైన రెండు నెలలకే..ఉపాధ్యాయురాలు ఆత్మహత్య     నలుగురిపై వరకట్నం, ఎస్సీ ఎస్టీ కేసు నమోదు అంగవైకల్యం అడుగడుగునా అవాంతరాలు సృష్టించింది. మొక్కవోని దీక్ష ముందుకు నడిపించింది. విధి పరీక్షకు  ఎదురొడ్డి నిలిచింది. లక్ష్యం దిశగా సాగించిన అక్షర యజ్ఞంలో విజయం వరించింది. జీవితం నేర్పిన పాఠం.. చిన్నారుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే దారి చూపింది. ఇలా సాగిపోతున్న ఆమె జీవితంలో అనుకోని మలుపు.. ప్రేమ. రోజూ వెంట నడుస్తుంటే.. ఏడడుగులు వేస్తాడనుకుంది. నిన్ను నిన్నుగా ప్రేమిస్తానంటే.. ఉన్నత భావాలు కలిగిన వ్యక్తిగా భ్రమపడింది.  ఆస్తిపాస్తులు లేవని తెలిసినా.. జీవితాంతం తోడుంటానంటే కలల ‘రాజు’గా భావించింది. పెళ్లికి ముందే వేసిన తప్పటడుగు.. అతని ప్రేమలోని ‘లోపాన్ని’ బయటపెట్టింది. పెద్దలు.. పోలీసులు.. మూడుముళ్లతో ఒక్కటి చేసినా, ఆ ప్రేమ డబ్బును వరించింది. పుట్టింటికి దూరమై.. మెట్టినింటి వేధింపులకు విసిగిపోయి.. కట్టుకున్నోడి అసలు రూపం బయటపడి.. ఈ జీవితం ఇక చాలనుకుంది. లోకం విడిచి వెళ్లిపోయింది. ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు పట్టణంలోని కిందిమాలగేరికి చెందిన లలితమ్మ, రంగ...

రాజా చెయ్యి వేస్తే' రివ్యూ..?

   సినిమా : రాజా చెయ్యి వేస్తే జానర్ : లవ్, యాక్షన్ డ్రామా నటీనటులు : నారా రోహిత్, నందమూరి తారకరత్న, ఇషా తల్వార్ తదితరులు సంగీతం : సాయి కార్తీక్ దర్శకత్వం : ప్రదీప్ చిలుకూరి నిర్మాత : సాయి కొర్రపాటి నెల నెలా వచ్చే జీతం మాదిరిగా ఈ మధ్యన నారా వారబ్బాయి సినిమాలు విడుదలవుతున్నాయి. తుంటరి, సావిత్రి సినిమాలు సందడి చేసి వెళ్లిన వెంటనే తాజాగా ఈ శుక్రవారం 'రాజా చెయ్యి వేస్తే'  అంటూ థియేటర్లకు వచ్చేశాడు. నందమూరి తారకరత్న ఈ సినిమాలో విలన్ గా నటించడంతో 'నారా vs నందమూరి' అంటూ సినిమా మీద ఆసక్తిని పెంచారు. ఆ ఆసక్తి ఆసాంతం కొనసాగిందో లేదో ఓ సారి చూద్దాం.. కథేంటంటే...  రాజారామ్ (నారా రోహిత్) అనే గ్రాడ్యుయేట్.. దర్శకుడు కావాలని తపించిపోతూ ఉంటాడు.  అవకాశం కోసం ప్రయత్నిస్తూనే ప్రస్తుతం సహాయ దర్శకుడిగా పని చేస్తుంటాడు. నిర్మాత దొరికితే సొంత కథతో సూపర్ హిట్ కొట్టాలనే ప్లాన్ తో ఉంటాడు. అతని గాళ్ ఫ్రెండ్ చైత్ర (ఇషా తల్వార్). ఓ రోజు కాఫీ షాప్ లో కూర్చుని తాను రాసిన సినిమా కథను చైత్రకు చెబుతుండగా విన్న చుట్టుపక్కలవారంతా థ్రిల్ అయిపోతారు. రాజా రామ్ ను తెగ మెచ్చుకుంటారు. ఆ తర్వాత రోజు ...

మాజీ భర్తకు పెళ్లి విషెష్ చెప్పిన నటి...?

తన మాజీ భర్త కరణ్ సింగ్ గ్రోవర్ పెళ్లిపై బాలీవుడ్ నటి జెన్నిఫర్ వింగెట్ మౌనం వీడింది. హారర్ క్వీన్ బిపాసా బసును పెళ్లాడబోతున్న కరణ్ కు ఆమె విషెస్ చెప్పింది. వారి వైవాహిక జీవితం సంతోషంగా సాగాలని ఆకాంక్షించింది. బిపాసా, కరణ్ శనివారం(ఏప్రిల్ 30) పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో వారికి వివాహ శుభాకాంక్షలు తెలిపింది. హిందూస్థాన్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిపాసా-కరణ్ పెళ్లి గురించి జెన్నిఫర్ ను అడగ్గా... 'ఐ విష్ దెమ్ గుడ్ లక్ అండ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మనసులు కలిసినప్పుడు పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు. వారికి దేవుడి దీవెనలు ఉండాలని ఆశిస్తున్నాను. ప్రేమ అనేది ఓ అద్భుతం. ఎవరిపైన అయిన మనకు ప్రేమ పుడితే అది గొప్ప విషయమే' అని బదులిచ్చింది. కాగా, జెన్నిఫర్ ను పెళ్లి చేసుచేసుకుని తప్పు చేశానని కరణ్ అంతకుముందు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆమెకు విడాకులు ఇచ్చిన అతడు ఇప్పుడు బిపాసాతో ఏడు అడుగులు వేసేందుకు రెడీ అయ్యాడు.   When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop ow...

ప్రభాస్ సరసన అందుకే నటించిందట...!

  ' ఏక్ నిరంజన్' సినిమాలో ప్రభాస్ సరసన నటించేందుకు  కంగనా రనౌత్ ఎందుకు ఒప్పుకొందో తెలుసా?  కంగనాతో విడిపోయిన బాలీవుడ్ హీరో, మరో మాజీప్రియుడు అధ్యాయన్ సుమన్ మరో సంచలన వ్యాఖ్యలు చేశాడు.  ఇప్పటికే  కంగనా, హృతిక్ రోషన్‌ల మధ్య వివాదానికి ఆజ్యం పోసిన సుమన్ తాజాగా టాలీవుడ్‌కి షాకిచ్చాడు. కంగనాకు చేతబడి లాంటి క్షుద్రవిద్యలు తెలుసుని ఆరోపించిన అతడు, మరో సంచలన విషయాన్ని వెల్లడించాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేసిన ఏక్ నిరంజన్ చిత్రంలో కంగనా రనౌత్ చేయటానికి కారణం ఓ బీఎండబ్ల్యు కారు అని వ్యాఖ్యానించాడు.  ఈ విషయాన్ని అధ్యయన్ సుమన్  బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ వివరించాడు. "అప్పట్లో మా నాన్నగారు నాకు ఓ బీఎండబ్ల్యు కారు గిప్ట్ గా ఇచ్చారు. ఇది చూసిన కంగనా చాలా అసూయ ఫీలయ్యింది. వెంటనే ఆమె హైదరాబాద్ వెళ్లి అక్కడ ప్రభాస్ సరసన ఏక్ నిరంజన్ చిత్రానికి కమిటైంది. కేవలం ఆ కారు కొనుక్కునే డబ్బు కోసమే ప్రభాస్ సరసన నటించేందుకు ఒప్పుకుంది'' అని తెలిపాడు. ఆ డబ్బుతో వెంటనే బీఎండబ్ల్యు కొనుక్కుని నాకు చూపించిందని, అంతటి అసూయ, హై టెంపర్ ఉన్న అమ్మాయి కంగనా అని తేల్చ...

‘కత్తి’లాంటి పూర్తి కమర్షియల్ చిత్రం..!!!

  ► ఎటువంటి రాజకీయ సన్నివేశాలు ఉండవు ►చిరంజీవితో సినిమాపై దర్శకుడు వీవీ వినాయక్ ► నేడు హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభం  మలికిపురం : తాను దర్శకత్వం వహించే  మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంలో ఎటువంటి రాజకీయ సన్నివేశాలు ఉండవని, ఇది ‘కత్తి’లాంటి పూర్తి కమర్షియల్ చిత్రంగానే రూపొందుతుందని ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ స్పష్టం చేశారు. మలికిపురంలో గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.  తమిళంలో హిట్ అయిన కత్తి సినిమాను తెలుగులో ‘కత్తి’ ఉప శీర్షిక లాంటోడు పేరుతో శుక్రవారం హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభమవుతుందన్నారు.   తనపై ఉన్న నమ్మకంతో 150వ సినిమా బాధ్యతలు అప్పగించడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. తొలిసారిగా కొణిదెల క్రియేషన్స్ బేనర్‌లో హీరో రామ్‌చరణ్ నిర్మాత గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో ఠాగూర్ చిత్రంమాదిరి చక్కటి సందేశం కూడా ఉంటుందన్నారు. అద్భుతమైన పాటలు, ఫైట్‌లతో చిరంజీవి అభిమానులను అలరిస్తారన్నారు. హీరోయిన్ ఎంపిక  జరగలేదని, సంగీతం దేవీ శ్రీ ప్రసాద్ అందిస్తారన్నారు. అత్యాధునిక సాంకేతిక విలువలతో  మే చివరి వారం నుంచి తొలిషెడ్యూల్ సినిమా షూటింగ్ ప్రారంభిస్...

ఔనా! దీపిక ఎంగేజ్‌మెంట్ అయిపోయిందా?

  'దీపికా.. మీ ఎంగెజ్‌మెంట్ సందర్భంగా నా ఆశీస్సులు. మీరిద్దరూ కలిసి జీవిస్తూ.. సుఖసంతోషాలను పొందాలని, మంచి భవిష్యత్‌ మీకు కలుగాలని ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నా' అంటూ బాలీవుడ్ ఆలనాటి నటి, డ్రిమ్‌గర్ల్‌ హేమామాలిని గురువారం ట్విట్టర్‌లో పెట్టిన మెసేజ్‌ పెద్ద దుమారమే రేపింది. బాలీవుడ్ జంట దీపికా పదుకొనె, రణ్‌వీర్‌ సింగ్‌ గతకొంతకాలంగా గాఢంగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. నిత్యం వార్తల్లో దర్శనమిస్తూ తమ ప్రేమను ప్రగాఢంగా చాటుకుంటున్న ఈ జంట రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా? ఈ విషయం తెలియడంతో హేమామాలిని వారికి శుభాకాంక్షలు తెలిపిందా? అన్న ఊహాగానాలతో ట్విట్టర్‌ ఊగిపోయింది. ఈ ప్రేమజంట ఫ్యాన్స్ అయితే వరుసగా హేమామాలిని ట్యాగ్‌ చేస్తూ.. నిజంగా మా దీపిక-రణ్‌వీర్‌ సింగ్‌ల ఎంగేజ్‌మెంట్ అయిపోయిందా? వారి పెళ్లి ఎప్పుడు, ఎక్కడ? అంటూ ఆరాతీయడం మొదలుపెట్టారు.   ట్విట్టర్‌లో హేమ శుభాకాంక్షలు చాలాసేపు హల్‌చల్ చేసిన తర్వాత డ్రీమ్‌ గర్ల్‌ తీరికగా స్పందించింది. 'అయ్యో! నేను శుభాకాంక్షలు తెలిపింది దీపికా పదుకొనేకు కాదు. ఈమె వేరే దీపిక' తిరిగ్గా సమాధానం ఇచ్చింది. దీంతో అభిమానులు నిట్టూర్చారు...

ముంబై TISS

    పే స్కేల్: రూ. 30,000/ సపోర్ట్ పర్సన్స్-8 పోస్టులు (తెలంగాణ, చతీస్గఢ్) అర్హత: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్టీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్, అండ్ ఎలక్ట్రానిక్స్లో బ్యాచి లర్ డిగ్రీలో ఉత్తీర్ణత సంబంధిత విభాగంలో 2 నుంచి 8 ఏండ్ల అనుభవం ఉండాలి. లోకల్ లాంగ్వేజీలో పరిజ్ఞానం ఉండాలి పే స్కేల్ : రూ. 25,000/ అప్లికేషన్ఫీజ:రూ. 500/- ఎస్సీ, ఎస్టీ, పీడబ్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ దరఖాస్తు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులకు చివరితేదీ:మే 2 మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

SJWN ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీ...!!!

   మినీరత్నహోదా కలిగిన ఎస్జేవీఎన్ లిమిటెడ్ ఖాళీగా ఉన్నమేనేజర్, ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దర ఖాస్తులను ఆహ్వానిస్తున్నది. పోస్టు పేరు సీనియర్ మేనేజర్/మేనేజర్ (ఎన్విరాన్మెంట్)-1 పోస్టు అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్ (ఎన్విరాన్ మెంటల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత లేదా ఎన్విరాన్ మెంటల్ ఇన్ గ్రాడ్యు యేట్, పోస్టు గ్రాడ్యుయేట్, డిప్లొమాలో ఉత్తీర్ణత. ఎమ్మెస్సీ (ఎన్విరా న్మెంట్ సైన్స్, లైఫ్ సైన్సెస్, బాటనీ, జువాలజీ)లో ఉత్తీర్ణత. ఎగ్జిక్యూటివ్టైయినీ (ఫైనాన్స్): 5 పోస్టులు అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీతోపాటు ఎంబీఏ (ఫైనాన్స్) లేదా సీఏ. ఐసీడబ్ల్యూఏలో ఉత్తీర్ణత. వయస్సు: 30 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్లు, వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూద్వారా - ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరితేదీ: మే 5 ఆన్లైన్ హార్ట్కాపీలను పంపడానికి చివరితేదీ: మే 20 మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి When you Call., Don't forget to mention th...

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండూమ్ టెక్నాలజీ

    ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండూమ్ టెక్నాలజీలో రాష్ట్ర అభ్య రులకు కేటాయించిన సీట్లలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. కోర్సు: హ్యాండూమ్ అండ్ టెక్నాలజీ డిప్లొమా కాలపరిమితి; మూడేండ్లు రాష్ట్రానికి కేటాయించిన సీట్లు - 8 అర్హతలు: పదోతరగతి లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. వయస్సు 2018, జూలై 18 నాటికి 15 - 23 ఏండ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు నిర్ణీత నమూనాలో చివరితేదీ: జూన్ 10 తరగతులు ప్రారంభం: జూలై 10 మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

ఇందిరా గాంధీ విషయాలు బయట పడ్డాయి ఇప్పుడు...?

  భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య 1971లో యుద్ధం చెలరేగే సమయానికి నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఏం చేస్తున్నారో తెలుసా? తీరిగ్గా దివాన్ మీద దుప్పటి మారుస్తున్నారట!! ఈ విషయాన్ని సరిగ్గా అదే సమయానికి అక్కడకు వెళ్లిన ఆమె వైద్యుడు డాక్టర్ కేపీ మాథుర్ తాజాగా విడుదల చేసిన పుస్తకంలో రాశారు. సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేసిన ఆయన.. దాదాపు రెండు దశాబ్దాల పాటు ఇందిరాగాంధీకి వ్యక్తిగత వైద్యుడిగా వ్యవహరించారు. ఆ కాలం నాటి అనుభవాలతో ఆయన 'ద అన్‌సీన్ ఇందిరాగాంధీ' అనే పుస్తకం రాశారు. ఆరోజు ఉదయం తాను ఆమెను చూసేందుకు వెళ్లేసరికి.. దివాన్ మీద దుప్పటి మారుస్తున్నారని, ముందురోజు రాత్రి యుద్ధానికి సంబంధించిన గొడవలు ఉండటంతో టెన్షన్‌గా గడిపినందున పొద్దున్నే రిలాక్స్ అయ్యేందుకు అలా చేసి ఉంటారని ఆయన రాశారు. 1971 డిసెంబర్ మూడో తేదీన పాకిస్థాన్ యుద్ధం ప్రారంభించే సమయానికి ఇందిర కోల్‌కతాలో ఉన్నారు. వెంటనే ఆమె తిరిగి ఢిల్లీకి వచ్చేశారు. విమాన ప్రయాణంలో కూడా ఆమె పెద్దగా టెన్షన్ ఏమీ పడలేదని, యుద్ధవ్యూహాలు, భవిష్యత్తులో చేయాల్సిన కార్యక్రమాల గురించే ఆలోచించారని మాథుర్ అన్నారు. అయితే, 1966లో ప్రధానమం...

OU బీకాం (ఆనర్స్) కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2016

  హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ బీకాం (ఆనర్స్)లో ప్రవేశానికి నిర్వహించే ఎంట్రెన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివరాలు: బీకామ్ (ఆనర్స్) జాబ్ ఓరియెంటెడ్ కోర్సు కాలవ్యవధి: మూడేండ్లు ఎంపిక: కామన్ ఎంట్రిన్స్ టెస్ట్ ద్వారా అర్హతలు: ఇంటర్ ఉత్తీర్ణులైన వారు లేదా సెకండియర్ పరీ క్షలు రాసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు: రూ. 400/- చెల్లించి కింది కాలేజీల్లో నేరుగా దర ఖాస్తులను పొందవచ్చు. కాలేజీలు: అరోరా కాలేజ్ అవంతి కాలేజ్, భద్రుకా కాలేజ్, భవన్స్ కాలేజ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్, జాగృతి కాలేజ్, కేశవ్ మెమోరియల్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ సైన్సెస్, ఆర్జీ కేడియా కాలేజ్, లాల్ బహదూర్ కాలేజ్ నృపతుంగ కాలేజ్, శ్రీ శారదా కాలేజ్, అవినాష్ డిగ్రీ కాలేజ్ (కూకట్పల్లి), సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ డిగ్రీ కాలేజ్ (బర్కత్పుర). చివరితేదీ: మే 18 - పరీక్షతేదీ:మే 21 (ఉదయం 11 నుంచి 12.30 వరకు మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి When you Call., Don't forget to mention that you found this "ADVERTISEME...

ఐఐటీ బాంబే ప్రాజెక్టు మేనేజర్ తదితర పోస్టుల భర్తీ...!!!

   ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ప్రాజెక్టు మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రాజెక్టు మేనేజర్ - 8 ఖాళీలు పేస్కేల్; నెలకు రూ. 50,000 - 70,000/ అర్హత పీహెచ్డీ (మెకానికల్/మెటీరియల్స్ లేదా బయో మెడికల్) యస్సు: 45 లోపు ఉండాలి ప్రాజెక్టు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ - 2 ఖాళీలు జీతం: నెలకు రూ. 40,000 - 58,000/ అర్హత: బీఈ/బీటెక్లో ఫస్ట్క్లాస్ మార్కులతో సీఎస్/ఐటీ బ్రాంచీలో  ఉత్తీర్ణత. కనీసం రెండేండ్లపాటు సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ డెవలప్ మెంట్ (గ్రాఫిక్స్ లేదా మొబైల్ లేదా క్లౌడ్ అప్లికేషన్స్)లో అనుభవం ఉండాలి. వయస్సు: 30 ఏండ్ల లోపు ఉండాలి. ప్రాజెక్టు అసిస్టెంట్ - 6 పోస్టులు అర్హతలు: బీఈ/బీటెక్(మెడికల్ ప్రాజెక్టుకు సంబంధించిన విభాగంలో) లేదా ఎంబీబీఎస్ లేదా బీపీటీలో ఫస్ట్క్లాస్లో ఉత్తీర్ణత. జీతం: నెలకు రూ. 30,000 - 42,000/ ప్రాజెక్టు టెక్నికల్ అసిస్టెంట్ - మ్యానుఫ్యాక్చరింగ్ - 2 పోస్టులు జీతం: నెలకు రూ. 18,000 - 28,000/ అర్హతలు: మెకానికల్ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ లేదా ప్రొడక్షన్లో ఫస్ట్ క్లాస్లో డిప్లోమా ఉత్తీర్ణత. క్యాడ్...

ఆకట్టుకుంటున్న అక్కీ హెయిర్ స్టయిల్...!

   ఇటీవల వినూత్న లుక్ లో అలరిస్తున్న బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ కుమార్ స్పోర్ట్స్ హెయిర్ స్టయిల్ వెనుక రహస్యం ఏమిటి అంటే... అంతా ఆయన క్రీడాభిమాని అవటం వల్లేనట. అదొక్కటే అసలు కారణం కాదు. చిన్నపాటి క్రాఫ్ ను తిన్నగా పాపిడి తీసి దువ్వినట్లుగా కనిపిస్తున్నఆయన కొత్త హెయిర్ స్టయిల్ వెనుక క్రీడాభిమానంతోపాటు మరో కారణం కూడా ఉంది. అదేమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇప్పటికే ట్రయలర్ తో అభిమానులను అలరిస్తూ త్వరలో విడుదల కాబోతున్నఅక్షయ్ చిత్రం.. 'హౌస్ ఫుల్ 3' నేపథ్యంలోనిదే ఆయన క్రాప్ వెనుక కథ.  అక్షయ్... ఆ చిత్రంలో ఫుట్ బాల్ ప్లేయర్ పాత్ర పోషిస్తున్నారు. అందుకే ఇటీవల ప్రపంచ ప్రఖ్యాత ఫుడ్ బాల్ క్రీడాకారులు క్రిస్టియానో రోనాల్డో, సెర్జియో ఆగ్రో కేశాలంకరణను అనుకరించే కొత్త లుక్ లో ఆయన కనిపిస్తున్నారు. క్రీడలపై తనకున్న ప్రేమ దాచేది కాదని... అది క్రికెట్, కరాటే, ఫుడ్బాల్ వంటివి ఏవైనా కావచ్చొని అక్షయ్ కుమార్ అంటున్నారు. అయితే వర్షాలు ఇతర అన్ని క్రీడలకు అడ్డంకిగా మారినా, ఫుడ్ బాల్ విషయంలో మాత్రం అటువంటి ఇబ్బంది ఎదురుకాదని, వర్షంలో కూడా ఎంతో ఎంజాయ్ చెయ్యగలిగే ఆటగా అక్షయ్ పేర్కొన్నారు....

చేతబడి ప్రాక్టీస్ చేసిన హీరోయిన్‌...!

  చేతబడి, క్షుద్రవిద్యలాంటి మూఢనమ్మకాలను మారుమూల గ్రామాల్లో చదువుకోని ప్రజలే కాదు.. సినిమాల్లో అత్యద్భుతమైన పాత్రలు చేస్తూ.. ప్రేక్షకులను మెప్పిస్తున్న హీరోయిన్ సైతం నమ్ముతోందా? ఏకంగా ఇంట్లోనే చేతబడి లాంటి క్షుద్రవిద్యల్ని ఔపోసన పడుతోందా? అంటే తాజాగా అవునని అంటున్నాడు బాలీవుడ్ హీరో అధ్యాయన్ సుమన్. కంగన తన ఇంట్లోనే చేతబడిలాంటి క్షుద్రపూజలు చేసేదని అతను తాజాగా వెల్లడించాడు. క్షుద్రపూజల కోసం ఆమె తన అపార్ట్‌మెంట్‌లో ఓ గది కూడా ఉందని చెప్పాడు.    కంగనా రనౌత్‌కు ఈ మధ్య కాలం కలిసి వస్తున్నట్టు కనిపించడం లేదు. ఇప్పటికే హీరో హృతిక్ రోషన్‌తో ఆమె గొడవ రోజూ మీడియాలో రచ్చ చేస్తుండగా తాజాగా ఆ మాజీ ప్రియుడు అధ్యాయన్‌ సుమన్‌ సంచలన విషయాలు వెల్లడించాడు. 2008లో 'రాజ్‌: ద మిస్టరీ కంటిన్యూస్‌' సినిమా సందర్భంగా సుమన్‌, కంగన ఏడాది పాటు డేటింగ్ చేశారు. కంగన మాజీ లవర్‌ ఆదిత్య పంచోలీ సూచనలు పెడచెవిన పెట్టి తాను కంగనాను ప్రేమించానని, కానీ ఒక రోజు తను ఇంటికి పిలిచి క్షుద్రపూజల్లో పాల్గొనేలా చేసిందని వివరించాడు. 'ఓరోజు రాత్రి కొన్ని పూజలు చేసేందుకు కంగన తన ఇంటికి పిలిచింది. రాత్రి 11.30...

ఐఐటీ రోపర్-IITRPRAC లో ఖాళీల భర్తీ...!!!

  రోపర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో కింది విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వివరాలు: ఐఐటీ రోపర్ ఇటీవల కేంద్రం విడుదల చేసిన ర్యాంక్ల్లో 9వ ర్యాంక్ సాధించింది. ఫ్యాకల్టీ పోస్టులు విభాగాలు: కెమిస్టీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్, ఫిజిక్స్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

సరికొత్త స్మార్ట్‌ఫోన్ బుకింగుల జోరు...?

   చైనీస్ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మిజు ఎమ్3 స్మార్ట్ ఫోన్ ను భారతదేశంలో మే11న విడుదల చేస్తామని అధికారిక ప్రకటన విడుదలైన కొన్ని గంటల్లోనే ముందస్తు బుకింగుల వెల్లువ కొనసాగుతోంది. కేవలం 24 గంటల్లోనే 45 లక్షల రిజిస్ట్రేషన్ల బుకింగ్స్ జరిగాయని కంపెనీ వెల్లడించింది. బడ్జెట్ స్మార్ట్ ఫోనుగా దీన్ని ఆవిష్కరించబోతున్నామని కంపెనీ తెలిపింది. 2జీబీ ర్యామ్ తో పాటు 16 జీబీ స్టోరేజితో ఒకటి, 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజితో మరొకటి రెండు వేరియంట్లను మార్కెట్లోకి ఈ స్మార్ట్ ఫోన్ రానుంది. 16 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.6 వేలు, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,200 గాను భారత మార్కెట్లో ప్రవేశపెడతామని కంపెనీ వెల్లడించింది. మిజు ఎమ్౩ ఫీచర్స్ : డ్యూయల్ సిమ్ 5 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే ఆక్టా-కోర్ మీడియా టెక్ ఎమ్టీ 6750 ప్రాసెసర్ 128జీబీ వరకు మైక్రో ఎస్డీ కార్డుతో సపోర్టు 13 ఎంపీ వెనుక కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా  ఫ్లైమి ఓఎస్ 5.1 బేస్డ్ ఆండ్రాయిడ్ లాలీపప్ When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to...