-->
Showing posts with label LATEST NEWS. Show all posts
Showing posts with label LATEST NEWS. Show all posts

May 27, 2016


దక్షిణ కొరియా బహుళ జాతీయ మొబైల్ కంపెనీ శామ్ సంగ్ గెలాక్సీ 'సీ' సిరీస్ నుంచి కొత్త గెలాక్సీ సీ7ను  అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే ఈ పోన్ ఎప్పటినుంచి  వినియోగదారులకు అందుబాటులో ఉంచుతుందో మాత్రం ప్రకటించలేదు. ఇటీవలే గెలాక్సీ సీ5ను శామ్ సంగ్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. శామ్ సంగ్ గెలాక్సీ సీ5 కంటే గెలాక్సీ సీ7 వేరియంటే పెద్దదిగా ఉంటుందని పేర్కొంది. ధర, ఫీచర్లను మాత్రమే కంపెనీ ప్రస్తుతం విడుదల చేసింది. శామ్ సంగ్ గెలాక్సీ సీ7 రెండు వేరియంట్లలో లభ్యం కానుందని పేర్కొంది. 32 జీబీ వేరియంట్ ధర రూ. 26,600, 64జీబీ ధర రూ.28,600గా ఉంచుతున్నట్టు తెలిపింది. శామ్ సంగ్ గెలాక్సీ సీ7 ఫీచర్స్....
ఆండ్రాయిడ్ 6.0 మార్స్ మాలో
హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ స్లాట్
5.7 అంగుళాల సూపర్ అమోలెడ్ ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే
ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 625 ఎస్ఓసీ
4జీబీ ర్యామ్
16 మెగాపిక్సెల్ కెమెరా
8 మెగాపిక్సెల్ కెమెరా
32 జీబీ, 64 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు
128జీబీ వరకు విస్తరణ మెమరీ
3300 ఎంఏహెచ్ బ్యాటరీ
గోల్డ్, పింక్, గ్రే, సిల్వర్ రంగుల్లో ఈ ఫోన్ లభ్యం
ఫింగర్ ప్రింట్ స్కానర్



When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

శామ్ సంగ్ గెలాక్సీ సీ7 ధర, ఫీచర్లు ఇవే...


అది ఎప్పుడో 1944వ సంవత్సరం. అప్పట్లో రెండో ప్రపంచయుద్ధం భీకరంగా జరుగుతోంది. ముగ్గురు సిబ్బందితో కూడిన అమెరికా బాంబర్ విమానం ఒకటి శత్రుస్థావరాల మీద దాడికి బయల్దేరింది. పసిఫిక్ మహాసముద్రం మీదుగా అది వెళ్తుండగా శత్రుసైన్యాలు దాన్నిగుర్తించి పేల్చేశాయి. దాంతో ఆ విమానం కాస్తా సముద్రంలో కుప్పకూలిపోయింది. ఆ ఘటన జరిగి ఇప్పటికి 72 ఏళ్లు గడిచింది. టీబీఎం-1సి అవెంజర్ విమానం ఇన్నేళ్ల తర్వాత సముద్ర అడుగుభాగంలో కనిపించింది. దాంట్లోనే విమాన సిబ్బంది అవశేషాలు కూడా కనిపించాయి. ఇన్నాళ్ల బట్టి ఆ విమానం కోసం శాస్త్రవేత్తలు గాలిస్తూనే ఉన్నారు.
ఇలా వివిధ సందర్భాల్లో కనిపించకుండా పో యిన అమెరికన్ విమానాలను కనిపెట్టేందుకు 'ప్రాజెక్ట్ రికవర్'ను చేపట్టారు. ఆ ప్రాజెక్టు సాధించిన విజయాల్లో ఇదొకటి. అత్యాధునిక సోనార్ టెక్నాలజీని ఉపయోగించి విమానాలు ఎక్కడున్నాయో వీళ్లు తెలుసుకుంటారు. కనిపించకుండా పోయిన సిబ్బంది మృతదేహాలలో మిగిలిన భాగాలను దేశానికి తీసుకొచ్చి, వారికి సగౌరవంగా అంత్యక్రియలు జరిపించాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని ప్రాజెక్ట్ రికవర్ గ్రూపు సహ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎరిక్ టెరిల్ తెలిపారు.



When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

72 ఏళ్ల తర్వాత బయటపడింది!


కడుపు నొప్పి వస్తుందని ఆసుపత్రికి వచ్చిన ఓ యువతి పొట్టలో కండోమ్‌ను గుర్తించిన డాక్టర్లు కంగుతిన్నారు. కామెరూన్ లోని ఓ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో యువతి అపెండిక్స్ లో ఉన్న కండోమ్ ను తొలగించిన డాక్టర్లు.. ఆమెకు కడుపునొప్పి నుంచి విముక్తి కలిగించారు.
వివరాల్లోకి వెళ్తే.. కడుపునొప్పితో పాటు వికారంగా ఉందని ఇటీవల ఓ 26 ఏళ్ల యువతి కామెరూన్ లోని ఓ ఆసుపత్రికి వచ్చింది. దీంతో ఆమె స్కాన్ రిపోర్టును పరిశీలించిన వైద్యులు.. అమె అపెండిక్స్ ఉబ్బి ఉండటాన్ని గమనించారు. దీంతో వెంటనే ఆపరేషన్ చేసిన వైద్యులు అపెండిక్స్ ను తొలగించే క్రమంలో అక్కడే ఉన్న రబ్బర్ లాంటి ఓ పదార్థాన్ని చూసి షాక్ తిన్నారు. దానిని పరీక్షించి చూసిన వైద్యులు చివరికి కండోమ్ గా తేల్చారు. కండోమ్ ను ఆమె నోటి ద్వారా తీసుకోవటం వల్ల అది అపెండిక్స్ వరకూ వచ్చి అడ్డుపడిందని  వైద్యులు తెలిపారు. వారం రోజుల క్రితం తన బాయ్ ఫ్రెండ్ తో కలిసిన సందర్భంలో ప్రమాదవశాత్తూ కండోమ్ ను మింగినట్లు ఆ యువతి వెల్లడించడంతో డాక్టర్లకు అసలు విషయం తెలిసింది.


When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

పొరపాటున కండోమ్ మింగేసిందట!



క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో ఫ్లిప్ కార్ట్ నుంచి ఆఫర్ లెటర్లు అందుకుని ఉద్యోగం రాక ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకునేందుకు  రెండు ఈ కామర్స్ సంస్థలు ముందుకు వచ్చాయి.  గుజరాత్ బాధిత విద్యార్థులకు  ఐఐఎం పేటీఎమ్, షాప్ క్లూస్ మద్దతు లభించింది. ఫ్లిప్ కార్ట్ లో ఆఫర్ లెటర్స్ అందుకుని భంగపడి, ఉద్యోగాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఐఐఎం గ్రాడ్యుయేట్లకు  తమ సంస్థలో ఉద్యోగాలు కల్పించేందుకు  యోచిస్తున్నట్టు పేటిఎం ప్రకటించింది.  వారికి ఉద్యోగాలిచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేటీఎం వైస్ ప్రెసిడెంట్ అమిత్ సిన్హా తెలిపారు. ఈ మేరకు  అహ్మదాబాద్ అధికారులతో మాట్లాడుతున్నామన్నారు.  విద్యార్థుల ప్రొఫైల్స్ పంపమని అడిగామనీ, వాటిని  పరిశీలించిన మీదట  నైపుణ్యానికి తగ్గట్టుగా పోస్టింగ్స్ ప్రకటిస్తామని ఆయన తెలిపారు.  ఇటీవల జరిగిన ప్లేస్‌మెంట్లలో పలు ఐఐఎంల నుంచి 50 మందిని విధుల్లోకి తీసుకున్నామని  పేర్కొంది. అలాగే  అహ్మదాబాద్ విద్యార్థులకూ తమ సంస్థలో అవకాశం ఇస్తామని  ప్రకటించింది. ప్లేస్ మెంట్  సెల్ నుంచి తమకు  ఈమెయిల్స్ అందాయనీ,  ఇంటర్వ్యూ తర్వాత ఎంపిక  చేస్తామన్నారు. రాబోయే రెండు వారాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు తెలిపారు.
మరోవైపు బాధిత  గ్రాడ్యుయేట్లు  తమను వ్యక్తిగతంగా కలిశారని  మరో ఈకామర్స్ సంస్థ షాప్ క్లూస్ తెలిపింది. తమకు ఇప్పటివరకు రెండు ఇమెయిల్స్ అందాయని షాప్  క్లూస్  సహ స్థాపకులు రాధిక అగర్వాల్ తెలిపారు. కాగా, తమ విద్యార్థులకు జరిగిన అన్యాయంపై అహ్మదాబాద్ ఐఐఎం మేనేజ్ మెంట్ ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులు సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్ లను ఉద్దేశించి ఘాటు లేఖ రాసిన సంగతి తెలిసిందే.




When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

వారికి పే టీఎం, షాప్ క్లూస్ మద్దతు

May 22, 2016


విజయనగరం అర్బన్: విజయనగరంలోని ట్విన్ సిస్టర్స్(కవలలు)కు ఎంసెట్ మెడికల్ విభాగంలో టాప్ ర్యాంకులు లభించాయి. కొడాలి అలేఖ్య 145 మార్కులతో 62వ ర్యాంక్, అఖిల 126 మార్కులతో 1,275వ ర్యాంక్ సాధించింది. వీరి తల్లిదండ్రులు తిరుమల ప్రసాద్, కృష్ణశాంతి వృత్తిరీత్యా వైద్యులు. పట్టణంలో వీరు ఓ ప్రైవేటు ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా ట్విన్ సిస్టర్స్ అలేఖ్య, అఖిల మాట్లాడుతూ తల్లిదండ్రుల నుంచి ఒత్తిడిలేని వాతావరణం లభించడం వల్లే ర్యాంక్ సాధించగలిగామన్నారు. తల్లిదండ్రుల బాటలోనే వైద్యసేవలను అందించడమే లక్ష్యమని చెప్పారు. జిప్‌మార్, ఎయిమ్స్ ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించి జాతీయ స్థాయి మెడికల్ కళాశాలల్లో చదవాలనుకుంటున్నట్లు తెలిపారు.
 
click the below image to get a best deal::









When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

ట్విన్ సిస్టర్స్‌.. ఆదుర్స్


సున్నితమైన సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి చైనా ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే 4880 లక్షల తప్పుడు పోస్ట్ లను సోషల్ మీడియాలో పోస్టు చేసిందని తేలింది. ప్రభుత్వ ఉద్యోగులే రహస్యంగా ఈ పని చేపట్టినట్టు సర్వేల్లో తెలిసింది. చాలా కాలం నుంచే వార్తల్ని, సమాచారాన్ని చైనా తన ఆధీనంలో ఉంచుకుందని వెల్లడైంది. అయితే అతిపెద్ద సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్ బుక్, గూగుల్ లాంటి వాటిని, ఇతర విదేశీ వెబ్ సైట్లను చైనా తన దేశంలో నిషేధించింది. స్థానిక సోషల్ మీడియా సైట్లు కూడా ప్రస్తుతం తన అథారిటీల ఆధీనంలో నడుస్తున్నాయి. హర్వర్డ్ యూనివర్సిటీ డేటా పరిశోధకుడు గ్రే కింగ్, చైనా "ఫిప్టీ సెంట్ పార్టీ" అనే పరిశోధనను చేపట్టారు. ప్రభుత్వానికి అనుకూలంగా సోషల్ మీడియాలో కామెంట్, పోస్టు చేసిన వారికి ప్రభుత్వం 50 చైనీస్ సెంట్లు ఇస్తుందని ప్రజల్లో రూమర్స్ రావడంతో ఆయన ఈ పరిశోధన చేశారు.
ఇంటర్నెట్ లో జరిగే రాజకీయ చర్చల్లో ఎక్కువగా ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంటున్నాయని ఈ పరిశోధన కనుగొంది. వాదనలకు, వివాదస్పద అంశాలకు మాత్రం ఈ పోస్టులు దూరంగా ఉంటున్నాయని తెలిపింది. ఎప్పడికప్పుడూ సబ్జెక్టును మారుస్తూ.. ప్రజలని తప్పుదోవ పట్టించడమే వారి లక్ష్యమని తెలిపింది. చాలా పోస్టుల్లో కమ్యూనిస్ట్ పార్టీ విప్లవాత్మక చరిత్ర, పాలనకు సంబంధించి గుర్తులే ఉంటున్నాయని సర్వే పేర్కొంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల్లే ఈ పోస్టులను ఎక్కువగా పోస్టు చేస్తున్నారని, కానీ వారు ఈ పనిని చేసినందుకు అదనపు వేతనం పొందుతున్నారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని సర్వే వెల్లడించింది.

సమాజంలో అశాంతి నెలకొనప్పుడు, ఏదైనా అతిపెద్ద రాజకీయ ఈవెంట్ జరిగినప్పుడు మాత్రం ఈ పోస్టులు ఎక్కువగా ఉంటున్నాయని, ప్రభుత్వానికి ఎక్కువగా సహాయపూరితంగా ఈ పోస్టులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయని పరిశోధన తెలిపింది. అయితే ఈ పరిశోధనపై చైనా సైబర్ స్సైస్ అడ్మినిస్ట్రేషన్, ఇంటర్నెట్ రెగ్యులేటరీ వెంటనే స్పందించలేదు. 
 click the below image to get a best deal::

https://www.facebook.com/freshdeals365




When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

చైనా తప్పుడు పోస్టులు ఎన్ని...


రియాల్టీ షోల పిచ్చి రానురానూ ముదిరిపోతోంది. ఈ మధ్య హైద్రాబాద్‌లో ఓ రియాల్టీ షో స్టంట్ పేరుతో ఒంటికి నిప్పంటించుకుని పాతబస్తీకి చెందిన కుర్రాడు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే అమెరికన్లతో పోలిస్తే మన దేశంలో ఈ రియాల్టీ షోల వ్యామోహం చాలా తక్కువనే చెప్పాలి. అయితే అమెరికన్లలో చాలామందికి బెట్టింగ్ పిచ్చి బాగా ఎక్కువ. ఫ్రెండ్‌తో బెట్ కట్టిన కెనడాకు చెందిన బ్రియాన్ జాంబిక్ అనే 55 ఏళ్ల మెజీషియన్ ఏ మగాడు చేయలేని, చేయకూడని పని చేశాడు. ఫ్రెండ్ బెట్ కట్టాడని ఆపరేషన్ చేయించుకుని వక్షోజాలు పెంచుకున్నాడు. అయితే జాంబిక్ ఈ బెట్‌లో గెలుచుకున్న మొత్తం 100 డాలర్లు. జాంబిక్ విషయం తెలుసుకున్న ఓ రియాల్టీ షో నిర్వాహకులు అతనితో ప్రోగ్రాం చేశారు. అతనిని రియాల్టీ షోకు రప్పించేందుకు నిర్వాహకులు 5వేల డాలర్లు సమర్పించుకున్నారు. జాంబిక్‌తో పాటు శస్త్ర చికిత్స చేసిన సర్జన్ కూడా ఈ షోలో పాల్గొన్నాడు. అతని పిచ్చితో ఏదో చేసుకుంటే రియాల్టీ షో పేరుతో పరువు తీసుకోవాలా అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 click the below image to get a best deal::


https://www.facebook.com/freshdeals365


When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

బెట్టింగ్ డబ్బుల కోసం ఏ మగాడు చేయలేని పని


ఈ రోజుల్లో ఆనందం వచ్చినా, బాధ కలిగినా చాలామంది ముందుగా చెప్పుకునేది ఫేస్‌బుక్‌కే. రకరకాల కార్యక్రమాలకు ఫేస్‌బుక్‌ వేదిక అవుతోంది. అందుకే తన భార్య.. బిడ్డను కనడాన్ని కూడా ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశాడు ఓ వ్యక్తి.
కాలీఫోర్నియాకు చెందిన ఫకమలో కిహే ఎకీ(Fakamalo Kihe Eiki) అనే వ్యక్తి తన భార్యకు నొప్పులు మొదలైన దగ్గర్నుంచి బిడ్డ బయటకు వచ్చే వరకు జరిగిన ప్రాసెస్‌ను ఫేస్‌బుక్‌ ద్వారా తన స్నేహితులకు లైవ్‌లో చూపించాడు. ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన చాలామంది ఆమెను ఎంకరేజ్‌ చేస్తూ ఆ సమయంలోనే కామెంట్స్‌ కూడా పోస్ట్‌ చేశారు. ఆ ప్రత్యక్ష ప్రసార వీడియోను ఇప్పటి వరకు 23 వేల మంది చూశారు. అన్ని యాంగిల్స్‌ నుంచి ఆ వీడియోను తీసి నెట్‌లో పెట్టాడు. 45 నిమిషాల ఆ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

click the below image to get a best deal::

https://www.facebook.com/freshdeals365


When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

ప్రసవాన్ని ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం

 
- 2021 నాటికి కనుమరుగు కానుందని అంచనా - వాటి స్థానంలో ‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్’ సాధనాలు - ‘ఎరిక్‌సన్’ సర్వేలో అధిక శాతం ప్రజల అభిప్రాయం

 ఇంకో ఐదేళ్లలో స్మార్ట్‌ఫోన్లు అనేవి లేకుండా పోతాయా.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధస్సు) ఆధారంగా పనిచేసే సాధనాలు రానున్నాయా.. అవుననే అంటోంది స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఎరిక్‌సన్. కొంతకాలం జపాన్‌కు చెందిన సోనీతో కలసి ఈ కంపెనీ స్మార్ట్ ఫోన్లు తయారు చేసింది. ప్రస్తుతం ‘కన్జూమర్ ల్యాబ్స్’ అనే మరో సంస్థను నడుపుతోంది. వినియోగదారుల తీరుతెన్నుల్లో వస్తున్న మార్పులను గుర్తించడమే ఈ సంస్థ లక్ష్యం. దాదాపు 40 దేశాలకు చెందిన లక్ష మందిపై సర్వే చేసి ఇటీవలే 2016కు సంబంధించిన అంచనాలను విడుదల చేసింది. 2021 నాటికల్లా స్మార్ట్‌ఫోన్లు ఉండకపోవచ్చని సర్వేలో తేల్చింది. సగానికి పైగా ప్రజలు ఈ అభిప్రాయం వ్యక్తం చేశారని ఎరిక్‌సన్ పేర్కొంటోంది. ఈ సర్వేలోని మరికొన్ని విశేషాలు..

నిర్ణయాల్లోనూ ‘స్మార్ట్’..
 ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్ల ద్వారా ఇంటర్నెట్ వాడకం విస్తృతమైంది. వ్యక్తులు తీసుకునే నిర్ణయాల్లోనూ ఇంటర్నెట్ ప్రభావం ఎక్కువవుతోందట. ఉదాహరణకు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినపుడు అక్కడ ఏ హోటల్ బాగుందో తెలుసుకునేందుకు గతంలో అయితే ఎవరైనా తెలిసిన అడిగేవారు. ఇప్పుడు మాత్రం ఆయా హోటళ్లపై ఇంటర్నెట్‌లో వచ్చిన రివ్యూలను ఎక్కువగా నమ్ముతున్నారు. స్మార్ట్‌ఫోన్ లేని వారు కూడా వివిధ వెబ్‌సైట్ల ద్వారా తుది నిర్ణయాలు తీసుకుంటున్నారు.

యూట్యూబ్‌లో గంటల కొద్దీ..
 ఈ కాలం యువత ముఖ్యంగా 16 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు వారిలో 20 శాతం మంది రోజుకు కనీసం 3 గంటల పాటు యూట్యూబ్ వీడియోలు చూస్తున్నారని ఎరిక్‌సన్ స్పష్టం చేసింది. ఐదేళ్ల కింద ఇది 7 శాతం మాత్రమే ఉండేది.

ఇటుక, కాంక్రీట్.. అన్నిట్లో సెన్సర్లు..
 ఇంటి నిర్మాణానికి వాడే ఇటుకలు, కాంక్రీట్‌లోనూ భవిష్యత్‌లో సెన్సర్లు ఇమిడ్చే అవకాశం ఉందని దాదాపు 55 శాతం మంది అభిప్రాయపడ్డారు. దీంతో నిర్మాణ లోపాలే కాకుండా నీటి లేకేజీ, చెమ్మ, విద్యుత్ సంబంధిత సమస్యలను కూడా ఎప్పటికప్పుడు గుర్తించి సరిచేసుకునే వీలుంటుందని పేర్కొన్నారు. అలాగే వచ్చే ఐదేళ్లలో ఇళ్లలో గాలి, తేమ శాతం, ఉష్ణోగ్రతలు నియంత్రించే సాంకేతికతలు అందుబాటులోకి వస్తాయని చాలామంది అభిప్రాయపడ్డారు.

వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో ఎమర్జెన్సీ నంబర్లు..
 అత్యవసర పరిస్థితుల్లో 108 లేదా 100 నంబర్లకు ఫోన్ చేయడం మనకు తెలిసిన విషయమే. అయితే రానున్న మూడేళ్లలో ఈ పరిస్థితి మారే అవకాశముందని, ఎమర్జెన్సీ సమయంలో వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ద్వారా సమాచారం అందించడం సర్వసాధారణమవుతుందని అధిక శాతం మంది నమ్ముతున్నారు.

ఆరోగ్యంపై నిఘా..
 ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకునేందుకు ఫిట్‌బిట్, స్మార్ట్‌ఫోన్ యాప్ వంటి వాడకం ఇటీవల పెరిగిపోయింది. అయితే భవిష్యత్‌లో ‘ఇంటర్నబుల్స్’ రంగంలోకి రానున్నాయి. చిన్న సైజులో ఉండే ఈ హైటెక్ పరికరాలు శరీరంలోని వివిధ భాగాల్లో ఉంటూ ఆరోగ్య స్థితిపై నిత్యం నిఘా వేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని 80 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఈ పరికరాలు ఇప్పటికే పరిశోధన దశలు దాటి వాణిజ్యపరంగా రూపుదిద్దుకుంటున్నాయి. 
 
click the below image to get a best deal::

https://www.facebook.com/freshdeals365



When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

ఇక స్మార్ట్‌ఫోన్‌కు బై బై....!


ఎంసెట్ మెడికల్‌లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించిన హేమలత

 విజయవాడ(గుణదల)/కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ప్రతిభకు ఆర్థిక స్థితిగతులు అడ్డంకి కాదని మధ్యతరగతి కుటుంబానికి చెందిన విద్యార్థిని రుజువు చేసింది. బట్టల దుకాణంలో గుమాస్తాగా పనిచేసే ఓ సాధారణ వ్యక్తి కుమార్తె ఎంసెట్-2016 మెడికల్ విభాగంలో తొలి ర్యాంకు సాధించి స్ఫూర్తిదాయకం గా నిలిచింది. శనివారం విడుదలైన ఎంసెట్ మెడికల్ ఫలితాల్లో కర్నూలు జోహరాపురానికి చెందిన మాచాని హేమలత మొదటి ర్యాంకు సాధించింది. కర్నూలులోని శ్రీనివాస క్లాత్ స్టోర్‌లో గుమాస్తాగా పనిచేస్తున్న మాచాని వీరన్న, చంద్రకళ దంపతుల రెండో కుమార్తె హేమలత. తన ముగ్గురు బిడ్డ లు చదువులో ఆణిముత్యాలని చెప్పారు. తన సంతానాన్ని ఉన్నత స్థానంలో నిలపడానికి నిరంతరం శ్రమిస్తున్నానని వీరన్న తెలిపారు.

 నాన్న కల నెరవేర్చిన హేమలత
 మాచాని వీరన్న, చంద్రకళ దంపతులకు ముగ్గురు ఆడ పిల్లలు సంతానం. పెద్ద కుమార్తె సౌజన్య ప్రస్తుతం మహానందిలో అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతోంది. రెండో కుమార్తె హేమలత ఎంసెట్ మెడిసిన్‌లో స్టేట్ ఫస్టు ర్యాంకు సాధించింది. వీరిద్దరూ కర్నూలులోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియెట్ పూర్తి చేశారు. ఇక మూడో కుమార్తె విజయశ్రీ ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. తన ముగ్గురు కుమార్తెల్లో ఒక్కరినైనా డాక్టర్‌గా చూడాలనుకున్నారు మాచాని వీరన్న. ఎన్నో వ్యయప్రయాలసకోర్చి పిల్లలను చదివించారు. రెండో తనయ మాచాని హేమలత ఎంసెట్‌లో రాష్ట్రంలో ప్రథమ ర్యాంకు సాధించి తండ్రి కలను సాకారం చేసింది.

 2015లో 248వ ర్యాంకు
 2015 ఎంసెట్ మెడికల్‌లో మాచాని హేమలత మొదటి ప్రయత్నంలోనే 248వ ర్యాంకు సాధించింది. అయితే, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం.. నిర్దేశిత వయసుకు 28 రోజులు తక్కువగా ఉండడంతో ఆమె అప్పట్లో వైద్య విద్యలో ప్రవేశం పొందలేకపోయింది.  

 న్యూరో సర్జన్ అవుతా
 ‘చాలా ఆనందంగా ఉంది. రోజుకు పన్నెండు గంటలు కష్టపడేదాన్ని. నిరంతరం పుస్తకాలతోనే దోస్తీ చేసేదాన్ని. తల్లిదండ్రుల కల నెరవేర్చడానికి నిరంతరం కష్టడుతూనే ఉంటా. న్యూరోసర్జన్ కావాలన్నది చిరకాల కోరిక. నా విజయం వెనుక మా తల్లిదండ్రులు, అధ్యాపకుల కృషి చాలా ఉంది. ఇంటర్మీడియెట్‌లో 985 మార్కులు వచ్చాయి’ అని హేమలత చెప్పింది.

 ర్యాంకర్ల మనోగతం
 న్యూరాలజిస్ట్‌నవుతా...
 మాది రంగారెడ్డి జిల్లా కొత్తగూడ, నాన్న నరేంద్రరెడ్డి న్యాయవాది. అమ్మ గృహిణి. చిన్నప్పటి నుంచి డాక్టర్‌ను కావాలనే ఆకాంక్షతో ఇంటర్‌లో బైపీసీలో చేరాను. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల శిక్షణతో రెండో ర్యాంకు సాధించాను. న్యూరాలజిస్ట్ కావాలనేది నా ఆశయం.
     - ఎర్ల సాత్విక్‌రెడ్డి, రెండో ర్యాంకర్

 తల్లిదండ్రుల ప్రోత్సాహం...
 సైదాబాద్‌కు చెందిన మా నాన్న సత్యనారాయణరెడ్డి సివిల్ ఇంజనీర్. నా అభీష్టం మేరకు ఇంటర్ బైపీసీలో చేర్పించారు. ఎంసెట్‌లో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించడం చాలా సంతోషంగా ఉంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఇంతటి విజయం సాధించా. న్యూరాలజిస్ట్ లేదా కార్డియాలజిస్ట్‌గా ప్రజలకు సేవ చేయాలనేది నా ఆకాంక్ష.    
 - ఎ.యజ్ఞప్రియ, మూడో ర్యాంకర్

 నగర కుర్రాడి సత్తా
 ఏపీ ఎంసెట్ మెడికల్‌లో నగరానికి చెందిన ఇక్రంఖాన్ సత్తా చాటాడు. 160 మార్కులు152 మార్కులు సాధించి ఐదో ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. నారాయణగూడ నారాయణ శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ చదివిన ఇక్రం ఎంపీసీలో 987 మార్కులు సాధించాడు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ చేయడమే తన లక్ష్యమని ఇక్రంఖాన్  తెలిపాడు.

 కార్డియాలజిస్ట్‌నవుతా
 బోయినపల్లికి చెందిన ఎస్.సాహితి సావిత్రి ఎస్‌ఆర్‌నగర్ చైతన్య కళాశాలలో ఇంటర్ చదివింది. మెడిసిన్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంకు సాధించింది. 160కు 152 మార్కులు తెచ్చుకుంది. ఇంటర్‌లో 982 మార్కులు సాధించింది. ఆమె తండ్రి రమణ ఐఎస్‌బీ లో, తల్లి దీప్తి సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్నారు. భవిష్యత్తులో కార్డియాలజిస్టునయ్యి సేవలందించాల న్నది తన ఆకాంక్షని సాహితి తెలిపింది.
 click the below image to ge a best deal::

https://www.facebook.com/freshdeals365



When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

గుమాస్తా కుమార్తె టాపర్...!!!

May 21, 2016


రామ్ గోపాల్ వర్మ పిల్లి అనగానే ఆయన పెంచుకుంటున్న పిల్లి అనుకుంటే పొరపాటే. ఈ పిల్లి హావభావాలు చూస్తే వర్మ దీనితో సినిమా చేసినాచేస్తాడు. ఎందుకంటే దానికో కారణం ఉంది. చాలామందికి హారర్ చిత్రాలు చూడటమంటే ఎంతో ఇష్టం. కొంతమంది భయపడుతూనే సగం కళ్లతో దెయ్యాల సినిమాలు చూస్తుంటారు. ఆ సమయంలో వారి ముఖంలో కనిపించే హావభావాలు చూడాలి.... ఆ కళే వేరు. అంత భయపడుతూ చూడటం ఎందుకని అడిగితే ఇష్టమని సమాధానం చెబుతారు. అయితే ఇదంతా ఇప్పుడెందుకంటే దానికి కారణం లేకపోలేదు. మనుషులు దెయ్యాల సినిమాలు చూసి భయపడటం సహజం. ఒక పిల్లి హారర్ సినిమా చూసి భయపడితే ఎలా ఉంటుంది. ఇలాంటి ఆలోచనే చేశారు కొంతమంది. వెంటనే పిల్లిని ఒంటరిగా కూర్చోబెట్టి టీవీలో దెయ్యాల సినిమా వేసి చూపించారు. ఆ పిల్లి పెర్ఫామెన్స్ చూస్తే ఔరా అనాల్సిందే. ఆ వీడియోను మీరూ చూడండి.

 
 click the below image to get a best deal::


https://www.facebook.com/freshdeals365




When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

రామ్ గోపాల్ వర్మ పిల్లి చుడండి...?

 
విరుధునగర్: కూతురు ఇంటర్మీడియట్‌లో మంచి మార్కులతో ఉత్తీర్ణురాలైంది. స్టేట్ లెవెల్ ర్యాంక్ కూడా వచ్చింది. తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ వారికి ఆ సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు. స్టేట్ లెవెల్ ర్యాంకు సాధించిన సెల్వీని ఇంటర్వ్యూ చేస్తానంటూ ఓ వ్యక్తి టీవీ రిపోర్టర్‌ పేరుతో ఇంటికి వచ్చాడు. సాధారణంగా ర్యాంకర్స్‌ను ఇంటర్వ్యూ చేయడానికి టీవీ చానెల్స్ వాళ్లు వస్తుంటారు కదా... ఇతను కూడా అలా వచ్చిన వాడే అని తల్లితండ్రులు భ్రమ పడ్డారు. ఆ వ్యక్తి సెల్వీని ఇంటర్వ్యూ చేశాడు. ఇంటర్వ్యూ అయిపోగానే సెల్వీ తల్లిదండ్రులను పిలిచి వారికి ఓ విషయం చెప్పాడు. సెల్వీ ర్యాంకు సాధించినందుకు కలెక్టరేట్ నుంచి 50వేలు ఇస్తారని నమ్మబలికాడు. సెల్వీని తన వాహనంపై ఎక్కించుకుని వెళ్లాడు. ఆమె తల్లిదండ్రులు బస్సులో కలెక్టరేట్‌కు వెళ్లారు.
 
కానీ వారికి అక్కడే అనుకోని సంఘటన ఎదురైంది. ఆ పేరుతో ఇక్కడకు ఎవరూ రాలేదంటూ కలెక్టరేట్ సిబ్బంది చెప్పారు. దీంతో తల్లిదండ్రులకు ఏం చేయాలో పాలుపోలేదు. సదరు టీవీ చానెల్‌కు వెళ్లి విచారించారు. విజయ్ ఆనంద్ అనే పేరుతో ఎవరూ లేరని చానెల్ యాజమాన్యం తెలిపింది. దీంతో అసలు విషయం అర్థమైంది. తమ కూతురు కిడ్నాప్ అయిందన్న విషయం తెలిసి.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సెల్వీ ఫోన్‌కు కాల్ చేయగా అందుబాటులో లేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన తమిళనాడులోని విరుధునగర్‌లో జరిగింది.
 click the below image to get a best deal::

https://www.facebook.com/freshdeals365




When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

టీవీ రిపోర్టర్‌నంటూ ఇంటికి వచ్చాడు... ఇంటర్వ్యూ చేస్తానంటూ.?


కొన్ని కోట్ల సంవత్సరాల కింద అంగారకుడిని రెండు భారీ ఉల్కలు ఢీకొనడం వల్ల దానిపై రెండు సునామీలు సంభవించాయని తాజా పరిశోధనలో తేలింది. దాదాపు 340 కోట్ల సంవత్సరాల కింద భారీ ఉల్కలు ఢీకొనడం వల్ల తొలిసారి సునామీ అల ఏర్పడిందని అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ పరిశోధకుడు అల్బర్టో ఫెయిరెన్ తెలిపారు. ద్రవరూపంలోని నీరు వల్లే ఈ అల ఏర్పడిందని పేర్కొన్నారు. అలాగే మరో భారీ ఉల్కా విస్ఫోటం వల్ల రెండో సునామీ చోటు చేసుకున్నట్లు శాస్త్రవేత్తలు ఆధారాలను కనుగొన్నారు.
 ఈ రెండు సునామీలకు మధ్య ఉన్న లక్షల సంవత్సరాల కాలం పాటు అంగారకుడు అతి శీతల స్థితిలోకి వెళ్లిపోయాడని గుర్తించారు. ఆ సమయంలోనే అక్కడి నీరు ఘనీభవించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీని ద్వారా అక్కడి సముద్రతీరం ప్రాంతంలోని నీరు చాలా వెనక్కి వెళ్లడం ద్వారా రెండో సముద్రతీరం ఏర్పడిందని భావిస్తున్నారు. రెండో సునామీ సంభవించిన సమయంలో సముద్రంలోని మంచు ఎగిరి చాలా దూరంలో పడిపోయిందని, ఇది తిరిగి సముద్రంలోకి రాలేదని ఫెయిరెన్ పేర్కొన్నారు. అంగారకుడు ఏర్పడిన తొలినాళ్లలో చాలా చల్లటి సముద్రాలు ఉండేవని స్పష్టం చేశారు.
click the below image to get a best deal::

https://www.facebook.com/freshdeals365



When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

340 కోట్ల ఏళ్ల కింద తొలి సునామీ


ఓ ప్రముఖ కంపెనీ మాజీ సీఈవో చేసిన పని ఇప్పుటు హాట్ టాపిక్ గా మారింది. ఫియట్ కంపెనీ మాజీ సీఈవో లాపో ఎల్కన్ తన పక్కనే నిల్చున్న హీరోయిన్ ఉమా థర్మన్ ను దగ్గరకు లాక్కుని గాఢంగా ముద్దుపెట్టుకున్నారు. చారిటీ కార్యక్రమంలో ఇలాంటి దిగజారుడు పనులు వ్యాపార దిగ్గజం చేయడంపై అందరూ ఆశ్చర్యపోయారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. అమెరికన్ ఫౌండేషన్ ఫర్ ఎయిడ్స్ రీసెర్చ్ వారు, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించిన ఉమా థర్మన్ సంయుక్తంగా ఈవెంట్ నిర్వహించారు. ఎయిడ్స్ బాధితులకు సహాయార్థం విరాళాలు సేకరించేందుకు ఏర్పాటుచేసిన ఈవెంట్ లో ఫ్యాషన్ షో టిక్కెట్లు కూడా విజేతలకు అందజేశారు.
విక్టోరియా ఫ్యాషన్ షోకు సంబంధించి ఆయన 1.32 కోట్ల రూపాయలు (1.96 లక్షల అమెరికా డాలర్లు) గెలుపొందారు. దీంతో తన సంతోషాన్ని వ్యక్తం చేయడానికి ఓ వింత మార్గాన్ని ఎంచుకున్నారు. ఈవెంట్ నిర్వహిస్తోన్న నటి థర్మన్ ను దగ్గరికి ఆమెతో లాక్కుని బలవంతంగా లిప్ లాప్ చేశారు. ఊహించని ఘటనతో ఆమె షాక్ కు గురైనా వెంటనే కోలుకుంది. ముద్దుపై స్పందించలేదు కానీ, తీవ్ర అసహనానికి గురైనట్లు మాత్రం తెలుస్తోంది. స్మోక్ చేస్తున్న ఎల్కన్ అవకాశవాది అని అందుకే అవకాశాన్ని వాడుకున్నాడని లెస్సీ స్లోనే అనే ఆర్గనైజర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. థర్మన్ కూడా ముద్దు విషయంపై హ్యాపీగా లేదని చెప్పింది. ఆమె అనుమతి లేనిదే ఇలాంటి దిగజారుడు చర్యకు ఇటలీ వ్యాపారవేత్త సాహసించాడంటూ మండిపడింది.
 click the below image to get a best deal::

https://www.facebook.com/freshdeals365



When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

ప్రముఖ కంపెనీ సీఈవో ఇలా చేశాడేంటి..!


తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య.. మరో సోదరి పరిస్థితి విషమం
 విజయవాడ (భవానీపురం): తండ్రి మరణాన్ని తట్టుకోలేని ముగ్గురు అక్కా చెల్లెళ్లు ఆత్మహత్యాయత్నం చేశారు. ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరో సోదరి పరిస్థితి విషమంగా ఉంది. విజయవాడ రూరల్ మండలం రాయనపాడు రైల్వే ట్రాక్‌పై శుక్రవారం జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు, బాధితుల బంధువులు తెలిపిన వివరాలు.. మృతురాళ్ల తండ్రి అబ్దుల్ రఫీ లారీ డ్రైవర్. రాయనపాడులోని ఒక బిస్కెట్ కంపెనీ గోడౌన్ నుంచి సరుకు చేరవేస్తుంటాడు. ఆయన భార్య షాకిరా సుల్తానా అనారోగ్యంతో ఉండటంతో గురువారం విజయవాడ ఆస్పత్రిలో ఉన్న ఆమెను చూసి ఇంటికి వస్తున్నానని పోరంకిలోని తన బావమరిదికి ఫోన్ చేసి చెప్పాడు.

కాగా, గురువారం ఉదయం పోరంకి ఎస్‌బీఐ ఏటీఎం దగ్గర రఫీ చనిపోయి ఉన్నట్లు అతని బావమరిదికి సమాచారం వచ్చింది. ఈ విషయం హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలో ఉంటున్న రఫీ కుమార్తెలు రుకియా సుల్తానా, షాహిన్, పర్వీన్‌లకు  తెలిసింది. విజయవాడ వచ్చిన వారు తండ్రి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. సాయంత్రం 6 గంటల సమయంలో రాయనపాడు వచ్చారు. ఏమనుకున్నారో ఏమో రైలుకింద పడి చనిపోవడానికి నిర్ణయించుకున్న వారు అర్ధరాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. షాహిన్ (21), పర్వీన్(19) అక్కడికక్కడే మృతి చెందారు. ఆత్మహత్యకు పాల్పడిన ప్రదేశం పక్కనే ఉన్న చిన్న గుంతలో రుకియా సుల్తానా(22) పడిపోవడంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు ఆమెను గొల్లపూడిలోని ఆంధ్రా హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. రుకియా సుల్తానాకు నెల కిందటే వివాహమైంది. ఆమె భర్త అమెరికాలో ఉన్నారు.
 click the below image to get a best deal::

https://www.facebook.com/freshdeals365



When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

రైలుకింద పడి అక్కా చెల్లెళ్ల మృతి..?

 
రాష్ట్రానికి రోను తుపాను ముప్పు తప్పింది. తీవ్ర భయాందోళనలకు గురిచేసిన ఈ తుపాను ప్రశాంతంగానే రాష్ట్రాన్ని దాటింది. శుక్రవారం మధ్యాహ్నం వరకు ‘రోను’ ఉత్తర కోస్తాలోనే పయనిస్తూ ఒడిశాలోకి ప్రవేశించింది. వాయవ్య బంగాళాఖాతంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో తూర్పు ఈశాన్య దిశగా పయనిస్తూ శుక్రవారం రాత్రి 10 గంటలకు ఒడిశాలోని పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయంగా 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. శనివారం సాయంత్రానికి బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌కు సమీపంలో ఖేపుపరా, కాక్స్ బజార్ల మధ్య తీరాన్ని దాటనుందని ఐఎండీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. ముందుగా అంచనా వేసినట్టుగా రోను తీవ్ర తుపానుగా బలపడకుండానే తీరాన్ని దాటుతుందని స్పష్టం చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు తప్పినట్టు ప్రకటించింది. రాష్ట్రానికి అన్ని రకాల తుపాను హెచ్చరికలను కూడా ఉపసంహరించింది.
రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే అవవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శుక్రవారం రాత్రి ‘సాక్షి’కి చెప్పారు. ఉత్తర కోస్తాలో గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లోనూ ప్రస్తుతం ఉన్న నాలుగో నెంబరుకు బదులు రెండవ నెంబరు ప్రమాద హెచ్చరికలను కొనసాగిస్తున్నారు. ఉత్తరకోస్తాలోని మత్స్యకారులు రానున్న 24 గంటల్లో సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని, దక్షిణ కోస్తాలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గడచిన 24 గంటల్లో ఇచ్చాపురం, కళింగపట్నంలలో 15, రణస్థలంలో 14, అమలాపురం, పలాస, అవనిగడ్డల్లో 11, టెక్కలి, మందసల్లో 10, సోంపేటలో 9, విశాఖలో 8 సెం.మీల వర్షపాతం నమోదైంది.
 
మరో 5 రోజులు వర్షాలే..
క్యుములోనింబస్ మేఘాల కారణంగా మరో ఐదు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. మరోవైపు రామగుండం, ఆదిలాబాద్‌లలో శుక్రవారం అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
 
పలు ప్రధాన పట్టణాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు
 ప్రాంతం         ఉష్ణోగ్రత
 రామగుండం    45.2
 ఆదిలాబాద్    44.8
 నిజామాబాద్    43.4
 హైదరాబాద్    38.6
 click he below image to get a best deal::

https://www.facebook.com/freshdeals365



When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

నేడు తీరం దాటనున్న తుపాను...?

May 20, 2016

 
భార్యతో గొడవపడి రైలు పట్టాలపై పడుకున్న వ్యక్తి
గుర్తించి రైలు ఆపిన లోకో పెలైట్
 అనంతపురం: అర నిమిషం గడిచి ఉంటే ఆత్మహత్య చేసుకోవాలనుకున్న అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయేవి. కానీ రైలు డ్రైవర్ అతని ప్రాణాలను కాపాడి కొత్త జీవితాన్నిచ్చాడు. దీంతో మృత్యువు కొద్ది దూరంలోనే ఆగిపోయింది. ఈ సంఘటన గురువారం సాయంత్రం అనంతపురంలోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీ ( పీటీసీ) సమీపంలో ఉన్న ఫ్లైఓవర్ కింద చోటు చేసుకుంది. కూడేరు మండలం కరుట్లపల్లికి చెందిన ముత్యాలు, జయమ్మ భార్యాభర్తలు.
ముత్యాలు లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. భార్యా భర్తల మధ్య విభేదాలున్నాయి. ఈ నేపథ్యంలో ముత్యాలు ఆత్మహత్యకు యత్నించాడు.ఈ క్రమంలో అతను అనంతపురం రైల్వే స్టేషన్ నుంచి బయలు దేరిన గుంతకల్లు- హిందూపురం ప్యాసింజర్ రైలుకింద పడాలనుకున్నాడు.లోకోపెలైట్ దూరం నుంచే గుర్తించి బ్రేక్ వేశాడు. సుమారు పదడుగుల దూరంలోకి వచ్చి రైలు ఆగిపోయింది. లోకో పెలైట్ ముత్యాలును  లేపి పక్కకు తప్పించాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ముత్యాలును అదుపులోకి తీసుకున్నారు.
 click the below image to get a best deal::


https://www.facebook.com/freshdeals365



When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

అడుగుల దూరంలో ఆగిన మృత్యువు..!!


పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫాన్ ఇంకా కొనసాగుతోంది. విశాఖకు 110 కి.మీ, కాకినాడకు 60 కి.మీ దూరంలో 'రోను' తుఫాన్ ఉంది. నేడు తీవ్ర తుఫానుగా మారే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని సమాచారం అందింది. తీరం వెంబడి 90 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. అన్ని ఓడరేవుల్లోనూ 4వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణశాఖ అధికారులు హెచ్చిరించారు.
వాయుగుండం తీవ్ర తుఫాన్ గా మారి శుక్రవారం ఒడిశా వైపుగా వెళ్లనుంది. శనివారం అర్ధరాత్రి బంగ్లాదేశ్‌లో తీరం దాటొచ్చని ఐఎండీ అధికారులు వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. శ్రీకాకుళం డివిజన్ లో అత్యధికంగా 5 సెం.మీ వర్షపాతం నమోదైంది. తీర ప్రాంత మండలాల రెవెన్యూ సిబ్బందిని కలెక్టర్ అప్రమత్తం చేశారు. సముద్ర తీరంలో అలలు ఎగసి పడుతున్నాయి. తీర ప్రాంతంలో గంటకు 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.

 click the below image to get a bes deal::

https://www.facebook.com/freshdeals365


When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

తీవ్ర రూపం దాల్చనున్న తుఫాన్!


ఓ యువతి తన బాయ్‌ ఫ్రెండ్ తో ఏకాంతంగా గడుపుతూ ప్రాణాలు కోల్పోయింది. అసహజ పద్ధతిలో ఆమె శృంగారాన్ని కోరుకుని ఆ క్రమంలో ప్రాణాలు విడిచింది. ఈ ఘటన మెక్సికోలో చోటుచేసుకుంది. పోలీసులు మృతురాలి బాయ్ ఫ్రెండ్ ను అదుపులోకి తీసుకుని విచారించగా అతడు విస్తుపోయే విషయాలు చెప్పాడు. ఆమెకు వాయిలెంట్ సెక్స్ అంటే ఇష్టమని ఆ క్రమంలోనే చనిపోయిందని వెల్లడించాడు. అతడు చెప్పిన ప్రకారం... మెక్సికోలో టానియా ట్రినిడాడ్ పారెడెస్ (23) అనే యువతి సైకాలజిస్ట్‌ గా పనిచేస్తుంది. ఆమెకు జువాన్ రుయిజ్ టార్రెస్(32) అనే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు.
ఆమె అతడు మరో వ్యక్తితో కలిసి తన అపార్ట్ మెంట్లో మద్యం సేవించారు. ఆ తర్వాత శృంగారంలో పాల్గొన్నారు. అలా పాల్గొనే క్రమంలో ఆమె రెండో వ్యక్తితో కూడా అసహజ పద్ధతిలో శృంగారానికి ఒత్తిడి చేసింది. అంతేకాదు ఓ కేబుల్ వైర్ తో తనను కొడుతూ ఉండాలని కోరిందని ఆ క్రమంలో అనూహ్యంగా కుప్పకూలి చనిపోయిందని చెప్పాడు. శవపరీక్ష నివేదికలో కూడా అతడు చెప్పిన విషయాలను బలపరిచే విధంగా ఉంది. ఊపిరి స్తంభించిపోయి ఆమె మృతి చెందిందని తెలిపింది. దీంతో పోలీసులు ప్రస్తుతానికి అతడిని అరెస్టు చేయకుండా మరో కోణంలో విచారిస్తున్నారు.
 click the below image to get a best deal::


https://www.facebook.com/freshdeals365


When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

అసహజ పద్ధతిలో శృంగారం....?


చాటలు దేనికి వాడతారు? బియ్యంలో రాళ్లేరుకోవడానికి... ఏమీ తోచకపోతే విసనకర్రలా విసురుకోవడానికి ఈ రెండు కార్యక్రమాల వల్ల వ్యక్తికి, కుటుంబానికి ప్రయోజనాలుండేవి. కాని ఇప్పుడు ఇంకో కొత్త చాటొచ్చి పడింది. అదేనండీ చాట్... వాట్సప్ చాట్.రాళ్లల్లో బియ్యం ఏరుకున్నట్టుంది. ఈ చాట్లలో పనికొచ్చేవి తక్కువ, పనికి రానివి ఎక్కువా కాబట్టి.  రాళ్లల్లో బియ్యం ఏరుకోవడమే ఎక్కువ.
 
భార్య: హాయ్... భర్త: హలో.. భార్య: ఏం చేస్తున్నారు... భర్త: పెద్దగా ఏం లేదు... భార్య: టైమ్ రెండయ్యింది. భర్త: రెండయ్యిందా.. అరె.. చూడలేదే. భార్య: ఇక కిందకు దిగొచ్చుగా భోజనానికి. భర్త: ఇదిగో ఇప్పుడే వస్తున్నా.

వాట్సప్‌లో భార్యభర్తల సంభాషణ ఇది. డ్యూప్లేలో నివాసం. పైన భర్త ఉంటే కింద నుంచి భార్య సాగించిన సంభాషణ ఇది. అతి మొదలు పూర్వం మనుషులు మాట్లాడుకునేవారు. ఒకరి ఇళ్లకు మరొకరు పోయి. ఒకరి పెళ్లికి మరొకరు పోయి. శుభకార్యం, చావు, కచ్చేరి దగ్గర, టీ స్టాళ్ల వద్ద, స్కూళ్లూ కాలేజీలలో, ఆఫీసుల్లో... ఒకరికొకరు ఎదురుపడితే మాట్లాడుకునేవారు. ఒకరిని ఒకరు చూసుకుంటూ మాట్లాడుకునేవారు. ఒకరి గురించి మరొకరు మాట్లాడుకునేవారు. ఇప్పుడు కూడా మాట్లాడుకుంటున్నారు. కాని పక్కనున్న మనిషితో కాదు. ఎక్కడో ఉన్న మనిషితో. ఇంటికొచ్చిన మనిషితో కాదు ‘ఆన్‌లైన్’లో ఉన్న మనిషితో. ఎదురుగా ఉన్న మనిషిని పట్టించుకోకుండా ఎక్కడో ఉన్న మనిషి కోసం తాపత్రయ పడే వింత మనస్తత్వం ఇప్పుడు ‘వాట్సప్’ వల్ల వచ్చి పడింది. ఫోన్‌కు ఖర్చవుతుందని, మెసేజ్‌లు చేస్తే బిల్లు పడుతుందని భయం ఉండేది. వాట్సప్ ఉంటే ఆ భయం ఏమీ లేదు. ఎన్ని గంటలైనా చాట్ చేసుకోవచ్చు. ఎంత మందితోనైనా చాట్ చేసుకోవచ్చు. ఎన్నిసార్లైనా చాట్ చేసుకోవచ్చు. నెట్‌కు పే చేయాలి. చాట్‌కు కాదు. కనుక ప్రతి ఒక్కరూ వాట్సప్‌కు ఆదరణ చూపారు. సమాచారం, ఫొటోలు, సంభాషణ సత్వరమే జరుపుకోవడానికి వీలు చూపే ఈ యాప్ మితంగా వాడుకుంటే మేలు. కాని శృతిమించితే ఇప్పుడది భయంకరమైన వ్యసనంగా మారే పరిస్థితి వచ్చేసింది.
 
గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్...
స్మార్ట్‌ఫోన్‌లు చేతికొచ్చి వాట్సప్ యాప్ పెట్టుకున్నాక మొదట చేసేపని అందరికీ హాయ్ చెప్పడం. ఆ తర్వాత చేసే పనంతా చెవులు రిక్కించడమే. మనం చెప్పిన హాయ్‌కు బదులుగా ఎవరైనా హాయ్ చెప్తే బీప్ వస్తుంది. బీప్ వచ్చిన వెంటనే సెల్ చేతిలోకి తీసుకొని వాట్సప్‌లోకి వెళ్లి ఆ సమాధానం చెప్పిందెవరో చూడాలి. వెంటనే ఒక స్మైలీని రెస్పాన్స్‌గా పడేయాలి. మళ్లీ ఎవరు సమాధానం ఇస్తారా ఎదురు చూడాలి. గుడ్‌మార్నింగ్ చెప్పడం అలవాటవుతుంది. అందరికీ ‘గుడ్‌మార్నింగ్స్ ఫ్రెండ్స్’ అని చెప్తే ఒక ఆనందం. ఒట్టి గుడ్ మార్నింగ్ కాకుండా ఏదైనా కొటేషన్ ఉన్న కార్డ్ పోస్ట్ చేయడం నెమ్మదిగా అలవాటవుతుంది. ‘లైఫ్ ఈజ్ టూ షార్ట్ టు హేట్ ఆన్ పీపుల్... గుడ్ మార్నింగ్’ అనే కొటేషన్‌తో ఉదయాన్నే వాట్సప్‌లో పోస్ట్ చేశాక మళ్లీ దానికి సమాధానం కోసం ఎదురు చూపు. ‘అబ్బ... చాలా మంచి కోట్ పెట్టావ్’ అని ఆ ఫ్రెండ్ రెస్పాండ్ అయితే ఆనందం... ఆ వెంటనే స్మైలీ పోస్టింగ్. ఇలా ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటే అంతమందికి... వాళ్ల సమాధానాలు... ప్రత్యుత్తరాలు... ఎంత టైమ్ వేస్ట్.
 
డిస్ప్లే పిక్చర్...
వాట్సప్ వ్యసనంలో పడ్డాక దానిని సజీవంగా ఉంచే వ్యసనం ‘డిస్‌ప్లే పిక్చర్’. వాట్సప్ మన ఫొటోను పెట్టుకునే ఏర్పాటు చేయడంతో కొందరికి రోజుకొక ఫొటో పెట్టడం అలవాటవుతుంది. ఇవాళ పడుకునే ముందు రేపేం ఫొటో పెట్టాలా అనే ఆలోచన. ఆ డిస్‌ప్లే ఫొటో చూసి ఫ్రెండ్స్ స్పందించి చాలా బాగున్నావ్... ఎక్కడ దిగావ్ అని అడిగితే ఆనందం. ఈ డిస్‌ప్లే కోసం సెల్ఫీల వలయంలో దిగాలి. గుడి దగ్గర సెల్ఫీ, మార్కెట్ దగ్గర సెల్ఫీ, భార్య/భర్తతో సెల్ఫీ, పిల్లలతో... తెలిసిన స్నేహితులకు తెలిసిన ముఖాలు... కాని మళ్లీ మళ్లీ పెట్టే వ్యసనం అలవాటవుతుంది. వీటి కోసం బట్టలు, కంటి అద్దాలు, అలంకరణ నగలు... ఇవి అదనంగా అవసరమవుతాయి. ఇతరులు పెట్టే ఫొటోలతో పోల్చి చూసుకోవడం... పోటీ పడటం... ఫలితంగా ఆశాంతిని కొని తెచ్చుకోవడం వాట్సప్ వల్ల వచ్చే అదనపు అనారోగ్యాలు.
 
గ్రూపుల తలనొప్పి...
పూర్వం కుటుంబాలు కలిసి మాట్లాడుకునేవి. కాని ‘మై ఫ్యామిలీ’ అని వాట్సప్ గ్రూప్ ఒకటి పెట్టుకుంటే చాలు. అందులోనే అన్ని పలకరింపులు అయిపోతాయి. మళ్లీ ఇక్కడ స్త్రీలకు రెండు ‘మై ఫ్యామిలీ’లు ఉంటాయి. భర్త తరఫు ఫ్యామిలీ ఒకటి. పుట్టింటి ఫ్యామిలీ ఒకటి. ఇక్కడి పోస్టింగులు వేరే. అక్కడి పోస్టింగులు వేరే. ఇక భర్త/భార్య ఉద్యోగం చేస్తూ ఉంటే కనుక ఆ ఉద్యోగస్తులతో ఒక వాట్సప్ గ్రూప్. పాత కాలేజీ మిత్రులతో ఒక గ్రూప్. అపార్ట్‌మెంట్‌లో ఉంటే అపార్ట్‌మెంట్‌లో ఉన్నవారందరితో ఒక గ్రూప్. ఆధ్యాత్మికత ఉంటే ఆధ్యాత్మిక ఆలోచనలు పంచుకునేవారితో ఒక గ్రూప్. జోక్స్ ఇష్టపడుతుంటే జోక్స్ షేర్ చేసేవారందరితో ఒక గ్రూప్... ఈ గ్రూప్‌లో రెగ్యులర్‌గా ఎవరో ఒకరు పోస్టింగులు చేస్తూ ఉంటారు. బీప్స్ మోగుతూ ఉంటాయి. ప్రతి దానికీ తెరిచి చూడాలనే తాపత్రయం. ఇక దేని మీదా ధ్యాస నిలవదు. ఒక్క నిమిషం చేతిలో నుంచి ఫోన్ దూరమైతే ప్రాణం పోతున్నంత పని. ఇవన్నీ మనుషులకు కొత్త సతమతాలు తీసుకొస్తున్నాయి.
 
ఏకాంతంలో అంతరాయం...
రోజంతా భర్త పని చేసి ఇంటికొస్తాడు. రోజంతా ఇంటి పని పిల్లల బాగోగులతో భార్య రాత్రికి కొంత తీరుబడి చేసుకుంటుంది. ఇద్దరూ రిలాక్స్ అయ్యి మాట్లాడుకునే సమయంలో దొరికిన ఆ కాస్త సమయాన్ని వాట్సప్ మెసేజస్ చెక్ చేసుకోవడానికి ఇటీవల భార్యాభర్తలు ఉపయోగిస్తున్నారని పరిశీలనల్లో తేలుతోంది. ఎవరో పంపిన వీడియోను చూసి భార్య నవ్వుతుంటే ఎవరో షేర్ చేసిన అడల్ట్ జోక్‌లో భర్త తల మునకలుగా ఉంటాడు. ఈ వ్యవహారం కాలక్రమంలో ఇరువురి మధ్యా దూరం పెంచుతోంది. ఒకరు అటెన్షన్ కోరుతున్నప్పుడు మరొకరు అది భార్య కాని భర్త కాని వాట్సప్‌లో మునిగి ఉంటే ఎదుటివారికి చిర్రెత్తుకొచ్చి కొట్లాటలు జరుగుతున్న పుణ్యం వాట్సప్‌కే దక్కుతోంది.
 
అతిథులకు అమర్యాద...
ఇంతకుముందు ఇంటికి ఎవరైనా వస్తే వారిని కూచోబెట్టి టీవీ చూస్తూ మాట్లాడటం ఒక అమర్యాదగా ఉండేది. కాని ఇప్పుడు ఎవరు ఎదురుగా ఉన్నా వారితో మాట్లాడుతూనే వాట్సప్ చెక్ చేయడం చాలా మందికి నిత్యానుభవంగా మారింది. దీనివల్ల ఎదుటివారు మనసు కష్టపెట్టుకొని మెల్లగా బంధాలు అనుబంధాలు స్నేహాలు దూరమయ్యి తెలియని సాంఘిక బహిష్కరణ వాట్సప్ వల్ల జరుగుతోంది.
 
అనవసరపు ఆందోళన...
వాట్సప్‌లో మెసేజ్ చేస్తే అది అవతలి వారు చూస్తే వెంటనే ‘టిక్’ మార్క్ వస్తుంది. మరి వారు చూసి కూడా సమాధానం చెప్పకపోతే? ఎందుకు చెప్పలేదు అనే ఆందోళన. మనం మధ్యాహ్నం రెండింటికి మెసేజ్ పెడితే వాళ్ల వాట్సప్ స్టేటస్‌లో లాస్ట్ సీన్ (ఆఖరున ఎన్నింటికి వాడింది) మధ్యాహ్నం నాలుగున్నర అని చూపిస్తుంది. అంటే మన మెసేజ్ చూసి కూడా సమాధానం చెప్పట్లేదంటే ఏమని? ఈ అశాంతి ఒకటైతే మూడు నాలుగు రోజులుగా వాట్సప్‌లో ఫలానావారు ఎటువంటి మెసేజూ పెట్టకపోతే అదొక అశాంతి. కొందరు ఎప్పుడు చూసినా ఆన్‌లైన్‌లో ఉంటారు. అంటే రాత్రి పదకొండు గంటలకు కూడా ఆన్‌లైన్‌లో ఉంటారు. ఈ సమయంలో కూడా ఆన్‌లైన్‌లో ఉన్నారంటే ఏం చేస్తున్నట్టు అని మరో ఆందోళన. ఇవన్నీ వాట్సప్ వ్యసనపరుల జీవితాలను కొరికి తినేస్తున్నాయి.
 
దారి మళ్లించాలి
వాట్సప్‌ను మితంగా వాడటం, కొన్ని సమయాల్లోనే వాడటం, మిగిలిన సమయాన్ని ఇష్టమైన వ్యాపకాలలోకి మళ్లించడం మంచిదని నిపుణులు అంటున్నారు. మద్యం, డ్రగ్స్ వలే మెదడు ఈ వ్యసనానికి అలవాటు పడటం ప్రమాదం అని సూచిస్తున్నారు. ముందు మనం ఈ వ్యసనానికి లోనయ్యాం అని గ్రహించి అటు పిమ్మట దానిని వదలించుకునే ప్రయత్నం గట్టిగా చేయకపోతే  చాటింగ్ చేటుకు చిత్తయిపోక తప్పదు.  - శశి వెన్నిరాడై
 
సోషల్ మీడియా  దుష్ర్పభావాలు
ఫేస్‌బుక్, వాట్సప్.. ఏదైనాసరే మొదట తినేసేది మన సమయాన్ని! కొత్తలో ఉత్సాహంగా మొదలై తర్వాత వ్యసనంగా మారి టైమ్‌ను బలితీసుకుంటుంది. సోషల్ నెట్‌వర్కింగ్ అంతా స్మార్ట్ ఫోన్‌లోనే ఆపరేట్ చేసుకునే వీలుండడం వల్ల రకరకాల సైట్లు అరచేతిలో కనిపిస్తున్నాయి. వీటి ప్రభావం టీనేజర్స్ మీద ఎక్కువగా ఉండి క్రైమ్‌రేట్ పెరిగే ప్రమాదం ఉంటోందని ఇటీవలి అధ్యయనాలు వెల్లడిచేస్తున్నాయి. వీటివల్ల కావాల్సిన దానికన్నా ఎక్కువ సమాచారం అందుబాటులో ఉండడం వల్ల కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఆ గందరగోళంలో మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటోందని మానసిక నిపుణులు చెప్తున్న సత్యం.
    
అలాగే ఫేస్‌బుక్, వాట్సప్‌లలో వ్యక్తిగత సమాచారం అంతా ఉంచడం వల్ల సైబర్ బుల్లీయింగ్ జరిగే ప్రమాదాలు ఎక్కువ అంటున్నారు సాంకేతిక నిపుణులు. అంతేకాదు వాట్సప్ గ్రూపులు, ఫేస్‌బుక్ పోస్టింగ్‌ల వల్ల ఎన్నో విషయాలు చర్చకు రావడం ఎంత నిజమో రచ్చకావడమూ అంతే వాస్తవం అంటున్నారు. వీటివల్ల అనవసరపు కవ్వింపులు, జోక్యాలు ఎక్కువై మనుషుల మధ్య స్నేహసంబంధాలు దెబ్బతింటున్నాయట.
 click the below image to get a best deal::

https://www.facebook.com/freshdeals365





When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

ఎంద చాటా... మనిషిని తినేస్తున్న చాటింగ్...?

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu