Skip to main content

ఆర్యను ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు...?


ఆర్యను ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. అయితే... అంటున్న త్రిషను ఎవర్‌గ్రీన్ ప్రైమ్‌టైమ్ కథానాయిక అనిపేర్కొనవచ్చు. కారణం అందరికీ తెలిసింది.మూడు పదుల వయసు దాటిన ఈ ప్రౌఢ నిత్య సంచలన నటి. నటీమణుల్లో అధిక వదంతులకు కేంద్రబిందువు ఎవరన్న విషయంలో నయనతార, త్రిష పేర్లు పోటీ పడతాయనడంలో అతిశయోక్తి ఉండదేమో. విశేషం ఏమిటంటే వారిద్దరు ఒకప్పుడు బద్దశత్రువులైతే ఇప్పుడు ప్రియమైన నేస్తాలు. 13 ఏళ్ల నట జీవితంలో ఐదు పదుల చిత్రాల సంఖ్యను అవలీలగా అధిగమిస్తున్న నేటికీ క్రేజీ హీరోయిన్‌గా వెలుగొందుతుండడం సాదారణ విషయం కాదు.ఈ హారర్‌కు మారిన ఈ చెన్నై చిన్నది నటించిన తాజా చిత్రం అరణ్మణై-2 శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా త్రిషతో చిన్న చిట్‌చాట్.
 
ప్ర: మీకూ దెయ్యంగా మారాలని ఆశ పుట్టినట్లుందే?
జ: 
తొలిసారిగా అరణ్మణై-2 చిత్రంలో దెయ్యంగా నటించాను. అరణ్మణై చిత్రం నాకు బాగా నచ్చింది. దానికి సీక్వెల్ చిత్ర కథ దర్శకుడు సుందర్.సీ చెప్పినప్పుడు అందులో నటించే అవకాశాన్ని వదులుకోదలచుకోలేదు. కుష్బూ నాకు మంచి స్నేహితురాలు. అరణ్మణై-2లో నటించడానికి ఇదొకకారణం. ఇందులో నటించే అవకాశం రావడం ఘనతగా భావిస్తున్నాను. సిద్ధార్ధ్, హన్సిక, సూరి తదితర కొత్త టీమ్‌తో నటించడం సంతోషకరం.
 
ప్ర: సెకెండ్ ఇన్నింగ్‌లోనూ బిజీగా నటించడం గురించి?
జ: 
నేను సినిమాలోకి వచ్చి 13 ఏళ్లుఅయ్యిందన్నది నమ్మలేకపోతున్నాను. అధిక చిత్రాలు చేయాలి, ప్రముఖ నటులతో నటించాలీ అనే మొదట్లో భావించాను. అయితే ఆ అనుభవం ఇప్పుడు మంచి కథాపాత్రలపై దృష్టి సారించాలని చెబుతోంది. ఇప్పుడు సెలెక్టెడ్ చిత్రాలే చేస్తూ రాశి గల నటిగా రాణిస్తున్నాను.
 
ప్ర: నాన్న మరణం, ఆగిపోయిన పెళ్లి లాంటి బాధాకరమైన సంఘటనలకు కుంగిపోకుండా వాటిని అధిగమించడం గురించి?
జ: 
నిజం చెబుతున్నా. మా కుటుంబంలో అందరూ ధైర్యవంతులే. ఎలాంటి విషయాన్నైనా ఈజీగా తీసుకుంటాం. నాకు మార్గదర్శిగా అమ్మ ఉన్నారు. జీర్ణించుకోలేని చేదు అనుభవాలు ఎదురైనప్పుడు కొన్ని రోజులు ఏకాంతంగా మౌనంగా ఉంటాను. ఆ తరువాత పనికి సిద్ధం అవుతాను. ఇదే నా కేరెక్టర్.
 
ప్ర: కొడి చిత్రంలో ధనుష్‌కు జంటగా నటించడం గురించి?
జ: 
మీకో విషయం తెలుసా? ఆడుగళం చిత్రం తొలుత నేనే కథానాయికని.ధనుష్‌తో కొన్ని సన్నివేశాల్లో నటించాను కూడా. ఆ సమయంలో హిదీ చిత్రంలో నటించాల్సి రావడంతో కాల్‌షీట్స్ సమస్య కారణంగా ఆడుగళం చిత్రం నుంచి వైదొలిగాను. ఆ తరువాత ఇన్నాళ్లకు కొడి చిత్రంలో ధనుష్‌తో నటిస్తుండడం సంతోషంగా ఉంది. ఇందులో మరో నాయికగా షామిలి నటిస్తున్నారు.

ప్ర: మీ యవ్వన రహస్యం?
జ: రహస్యం అంటూ ఏమీలేదు. అన్నీ ఫుల్‌గా లాగించేస్తాను. ఆర్య చెప్పినట్లు రెండు ప్లేట్లు బిరియాని కూడా తినేస్తాను. అయితే ఎంత తిన్నానో అన్ని రోజులు తినడం మానేస్తాను. పళ్ల రసం మాత్రమే తీసుకుంటాను.
 
ప్ర: ఇన్నేళ్ల నట జీవితంలో కథాపాత్ర కోసం పారితోషికం విషయంలో పట్టువిడుపుల సంఘటనలు ఉన్నాయా?
జ: అలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి.ఇం కా చెప్పాలంటే తొలుత పారితోషికం గురించి మా ట్లాడను. కథే ముఖ్యం. అది బాగా నచ్చితే పారితోషికం తగ్గించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి.
 
ప్ర: నయనతారతో కలిసి నటించనున్నారటగా?
జ: అలాంటిదేమీ లేదు. మీడియా వాళ్లు కొందరు అలా ప్రచారం చేశారు. నిజంగా అలాంటిదేదైనా ఉంటే సోషల్ మీడియాలో నేనే పోస్ట్ చేసేదాన్ని. నేను నయనతార మంచి స్నేహితులమే. సరైన కథ అమరితే ఇద్దరం కలిసి నటిస్తాం.

ప్ర: నటుడు ఆర్య ఇటీవల ఒక కార్యక్రమంలో త్రిష నాకు చెల్లెలు మాదిరి అన్నారే?

జ: ఆర్య అలా అన్నారా? నిజంగానే ఆర్య చాలా మంచి వ్యక్తి. ఆయనతో ఎలాంటి విషయమైనా పంచుకోవచ్చు. హీరోయిన్లకు మంచి మిత్రుడు. ఆయన ఇంటికి ఎప్పుడు వెళ్లినా భోజనం చేయవచ్చు. ఆయన్ని ఎక్కడికైనా పిలుచుకుపోవచ్చు. ఇక నన్ను చెల్లెలు అనడమే కామెడీ. ఈ విషయం గురించి ఆర్యను అడిగే తీరుతాను.
 
ప్ర: ఈ మధ్య పార్టీలకు వెళ్లడం తగ్గించినట్లున్నారే?
జ: క్లోజ్ ఫ్రెండ్స్ బర్త్‌డే పార్టీలు అంటేనే నేను పాల్గొంటాను. అలాంటిది ఎక్కువగా పార్టీలకు వెళతానే ప్రచారం జరుగుతోంది. అప్పుడప్పుడు స్నేహితురాళ్లం ఒక చోట కలుసుకుంటాం. ఇది సాధారణంగా అందరూ చేసే పనే. అయితే సినిమా వాళ్ల విషయంలో దాన్ని భూతద్దంలో చూపించే ప్రయత్నం జరుగుతోంది.
 
ప్ర: మళ్లీ రానాతో ప్రేమాయణం అన్న ప్రచారం గురించి?
జ: అందరితో మసలుకున్నట్లే రానాతోనూ ఉంటాను. మా మధ్య స్నేహం తప్ప మరేమీలేదు. ఈ విషయం గురించి పత్రికల వాళ్లే రాస్తున్నారు. అలాంటిది ప్రేమా అని అడగడంలో అర్థం లేదు.
 
ప్ర: సరే.. పెళ్లెప్పుడు చేసుకుంటారు?
జ: బిజీగా ఉన్నప్పుడు నేనే కాదు ఏ నటి పెళ్లి గురించి నిర్ణయం తీసుకోదు. మరో విషయం ఏమిటంటే ఇప్పుడు 30, 40 ఏళ్ల వయసన్నది పెద్ద విషయమే కాదు. ఇక నాకు పెళ్లి ఎప్పుడు జరుగుతుందో నాకే తెలియదు. మనసుకు నచ్చిన వాడు లభించాలి. రాణీముఖర్జీ, ఐశ్వర్యారాయ్‌లాంటి వారు లేట్‌గానే పెళ్లి చేసుకున్నారు. నటి ప్రియాంక ఇప్పటికీ దుమ్మురేపుతున్నారు. ఇంకా చెప్పాలంటే జీవిత భాగస్వామి లభించడం అంత సులభం కాదు. సమయం వచ్చినప్పుడు పెళ్లి విషయం ఆలోచిస్తాను.

Comments

Popular posts from this blog

మీ దగ్గర రూటర్ లేకపోయినా మీ లాప్‌టాప్‌లోని ఇంటర్నెట్ ఇలా ఫోన్, టాబ్లెట్లలో వైర్‌లెస్‌గా పొందండి

నేటి వార్తావిశేషాలు నేటి నుంచి గ్రేటర్ హైదరాబాద్ లో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర నేడు కేటీపీఎస్ రెండోదశ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్న కేసీఆర్ నేడు కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన.'జన్మభూమి-మాఊరు' కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం నేడు ఢిల్లీకి వెళ్లనున్న తెలంగాణ ఉన్నతాధికారులు సీఎస్, డీజీపీ నేడు గ్రేటర్ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ భేటీ నేటి నుంచి రెండు రోజులపాటు పశ్చిమ బెంగాల్ లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన ఆప్ నేతలపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వేసిన పరువు నష్టం దావాపై నేటు పాటియాల హౌజ్ కోర్టులో విచారణ

50 లక్షల ఉద్యోగాలు స్వాహా....

తిక్క లెక్క ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రోబోల వాడకం వల్ల లేదా వాటి కృత్రిమ మేధ వల్ల రానున్న 5 ఏళ్లలో దాదాపు 15 దేశాలలో సుమారు 50 లక్షల ఉద్యోగాలు పోనున్నాయని తాజా అధ్యయనం తెలుపుతోంది. దావోస్ (స్విట్జర్లాండ్)లో జరుగుతున్న ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్’ (డబ్ల్యు.ఇ.ఎఫ్) వార్షిక సమావేశాలలో ఆ మేరకు నివేదిక విడుదలైంది. వాస్తవానికి 70 లక్షల ఉద్యోగాలు పోనున్నాయని, అయితే ఈ కృత్రిమ మేధను ఉపయోగంలోకి తేవడానికి అవసరమైన 20 లక్షల కొత్త ఉద్యోగాలు అవసరమైనందుకు స్థూలంగా 50 లక్షల ఉద్యోగాలు పోకతప్పదని నిర్థారిస్తున్నారు. ఉద్యోగం కోల్పోయేవాళ్లలో ఆడవాళ్లే ఎక్కువ శాతం ఉండొచ్చట. సేల్స్, అడ్మినిస్ట్రేషన్, గుమస్తాగిరి వీటిలో ఎక్కువగా ఉండేది మహిళా ఉద్యోగులే కనుక రోబోల వాడకం ఇక్కడే ఎక్కువ కానున్నది కనుక భారీ నష్టం ఆడవారికేనని తాజా హెచ్చరిక. సో... రోబోలకు చిక్కని మేధో ఉపాధి మార్గాలలోకి స్త్రీలు బదిలీ కాకతప్పదేమో.