Skip to main content

ఆ ఉగ్రవాది... అఫ్రిదీ...?


పోలీసు అధికారిపై కాల్పులు జరిపింది అతడే
రియాజ్ భత్కల్ ద్వారా ఐఎంలోకి
2008 నుంచి పూర్తి అజ్ఞాతవాసం

 
సాక్షి, హైదరాబాద్: బెంగళూరులోని పరప్పన అగ్రహార ప్రాంతంలో శనివారం తెలంగాణ పోలీసు అధికారిపై హత్యాయత్నం చేసిన ఉగ్రవాది ఆలమ్ జబ్ అఫ్రిదీ అని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) నిర్థారించింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్‌గా ఉండి, 2008 నుంచి అజ్ఞాతంలో ఉన్న ఇతగాడు ప్రస్తుతం జునూద్ అల్ ఖలీఫా ఏ హింద్ ఉగ్రవాద సంస్థకు శిక్షకుడిగా పని చేస్తున్నాడని అధికారులు చెబుతున్నారు. ఇటీవల బెంగళూరులోని ఫ్రెంచ్ కాన్సులేట్‌కు పది రోజుల క్రితం వచ్చిన బెదిరింపు లేఖ సైతం ఇతడి పనేనని దాదాపు నిర్థారించాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్ జోహాపురా ప్రాంతానికి చెందిన ఆలమ్ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ద్వారా ఉగ్రవాద బాట పట్టాడు.

హలోల్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద శిక్షణకు హాజరుకావడంతో పాటు మరికొందరినీ ఉగ్ర బాట పట్టించాడు. 2008లో జరిగిన అహ్మదాబాద్, సూరత్, జైపూర్ పేలుళ్లలో కీలకపాత్ర పోషించిన ఇతడికి ఐఎం మాస్టర్‌మైండ్స్ రియాజ్, ఇక్బాల్ భత్కల్స్‌తో సన్నిహిత సంబంధాలున్నాయి. నాటి పేలుళ్లలో బాంబులు పెట్టడానికి వినియోగించిన సైకిళ్లను ఆలమే సమకూర్చాడు. నిఘా, దర్యాప్తు సంస్థలు 2009లో ఐఎం మాడ్యూల్‌ను గుర్తించి వరుస అరెస్టులు చేశాయి. అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఆలమ్ అనేక ప్రాంతాల్లో సంచరిస్తూ తలదాచుకున్నాడు.
 
మెకానిక్‌గా అవతారం...
దాదాపు మూడేళ్లుగా బెంగళూరులోని హోసూర్ రోడ్ దొడ్డనాగమంగళం ప్రాంతంలో ఉంటున్న ఆలమ్... రఫీఖ్ అహ్మద్ పేరుతో మెకానిక్‌గా చెలామణి అవుతున్నాడు. ప్రస్తుతం సిరియాలో ఉన్న షఫీ ఆర్మర్ ప్రోద్బలంతో కొత్తగా రిక్రూట్ అవుతున్న ‘జునూద్’ క్యాడర్‌కు శిక్షణ ఇవ్వడానికి అంగీకరించాడు. బాంబుల తయారీ, ఆయుధాల వినియోగంపై ఎక్కడ శిక్షణ ఇవ్వాలనే అంశంపై ఈ సంస్థ చీఫ్ ముంబైకి చెందిన ముదస్సిర్‌తో పాటు హైదరాబాదీ నఫీస్ ఖాన్‌తోనూ సంప్రదింపులు జరుపుతున్నాడు. శుక్రవారం వీరు అరెస్టు కావడం, విచారణలో ఆలమ్ పేరు వెలుగులోకి రావడంతోనే ఎన్‌ఐఏ అధికారులు తెలంగాణ అధికారుల సాయంతో శనివారం అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే పోలీసు అధికారిపై హత్యాయత్నం జరిగింది.

బెంగళూరులోని ఫ్రెంచ్ కాన్సులేట్ కార్యాలయానికి ఈ నెల 21న అందిన బెదిరింపు లేఖ సైతం ఇతడి పనిగానే ఎన్‌ఐఏ అనుమానిస్తోంది. దొడ్డనాగమంగళంలోని ఇతడి ఇంట్లో తనిఖీలు చేసిన అధికారులు ఈ తరహాలోనే రాసి ఉన్న దాదాపు 20 బెదిరింపు లేఖల్ని స్వాధీనం చేసుకున్నారు. ఆలమ్‌పై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు సైతం జారీ చేశారు. హత్యాయత్నం కేసులో బెంగళూరు పోలీసు కస్టడీలో ఉండగానే ఇతడు రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిసింది.

Comments

Popular posts from this blog

మీ దగ్గర రూటర్ లేకపోయినా మీ లాప్‌టాప్‌లోని ఇంటర్నెట్ ఇలా ఫోన్, టాబ్లెట్లలో వైర్‌లెస్‌గా పొందండి

నేటి వార్తావిశేషాలు నేటి నుంచి గ్రేటర్ హైదరాబాద్ లో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర నేడు కేటీపీఎస్ రెండోదశ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్న కేసీఆర్ నేడు కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన.'జన్మభూమి-మాఊరు' కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం నేడు ఢిల్లీకి వెళ్లనున్న తెలంగాణ ఉన్నతాధికారులు సీఎస్, డీజీపీ నేడు గ్రేటర్ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ భేటీ నేటి నుంచి రెండు రోజులపాటు పశ్చిమ బెంగాల్ లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన ఆప్ నేతలపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వేసిన పరువు నష్టం దావాపై నేటు పాటియాల హౌజ్ కోర్టులో విచారణ

50 లక్షల ఉద్యోగాలు స్వాహా....

తిక్క లెక్క ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రోబోల వాడకం వల్ల లేదా వాటి కృత్రిమ మేధ వల్ల రానున్న 5 ఏళ్లలో దాదాపు 15 దేశాలలో సుమారు 50 లక్షల ఉద్యోగాలు పోనున్నాయని తాజా అధ్యయనం తెలుపుతోంది. దావోస్ (స్విట్జర్లాండ్)లో జరుగుతున్న ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్’ (డబ్ల్యు.ఇ.ఎఫ్) వార్షిక సమావేశాలలో ఆ మేరకు నివేదిక విడుదలైంది. వాస్తవానికి 70 లక్షల ఉద్యోగాలు పోనున్నాయని, అయితే ఈ కృత్రిమ మేధను ఉపయోగంలోకి తేవడానికి అవసరమైన 20 లక్షల కొత్త ఉద్యోగాలు అవసరమైనందుకు స్థూలంగా 50 లక్షల ఉద్యోగాలు పోకతప్పదని నిర్థారిస్తున్నారు. ఉద్యోగం కోల్పోయేవాళ్లలో ఆడవాళ్లే ఎక్కువ శాతం ఉండొచ్చట. సేల్స్, అడ్మినిస్ట్రేషన్, గుమస్తాగిరి వీటిలో ఎక్కువగా ఉండేది మహిళా ఉద్యోగులే కనుక రోబోల వాడకం ఇక్కడే ఎక్కువ కానున్నది కనుక భారీ నష్టం ఆడవారికేనని తాజా హెచ్చరిక. సో... రోబోలకు చిక్కని మేధో ఉపాధి మార్గాలలోకి స్త్రీలు బదిలీ కాకతప్పదేమో.