Skip to main content

మెగాఫోన్ పట్టిన హాసిక దత్


మెగాఫోన్ పట్టిన హాసిక దత్
సినీ దర్శకత్వాన్ని కొంచెం కష్టం కొంచెం సులభం అని అనవచ్చు. కొంచెం కష్టం అన్నది ఒకప్పుడు. కొంచెం సులభంగా ఇప్పుడు మారింది. అందుకు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఒక కారణం కావచ్చు. చాలా మంది దర్శకత్వ శాఖలో పని చేయకుండానే మెగాఫోన్ పట్టి విజయాలు సాధిస్తున్న సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా నారీమణులు దర్శకురాళ్లుగా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. గతంలో దర్శకురాళ్లుగా రాణించి కథానాయికలు ఉన్నారు.

 ఇక ఇటీవల చూస్తే వడచెన్నై చిత్రంతో కృత్తిక ఉదయనిధిస్టాలిన్, పూవరసన్ పీపీ చిత్రంలో హలీత్‌సమీన్, మాలై నేరత్తు మయక్కం చిత్రంతో గీతాంజిలి సెల్వరాఘవన్ వంటి వారు మెగాఫోన్ పట్టారు. తాజాగా ఈ కోవలోకి వర్ధమాన కథానాయకి హాసికదత్ చేరారు. 1 బంతి 4 రన్స్ 1 వికెట్ తదితర చిత్రాల్లో నాయకిగా నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు  బేబీడాల్ అనే చిత్రం ద్వారా దర్శకురాలిగా అవతారమెత్తారు.

  మరో పక్క నాయకిగానూ నటిస్తూ ద్వి బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ భామ మాట్లాడుతూ తనకు దర్శకత్వం అంటే చాలా ఆసక్తి అన్నారు. హీరోయిన్‌గా నటిస్తున్నా దర్శకత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నానని చెప్పారు. ఈ బేబీడాల్ చిత్రాన్ని ఎస్.రవిశంకర్ సమర్పణలో కుత్తూస్ బాషా నిర్మిస్తున్నారని తెలిపారు. మానస్ అనే నవ నటుడు కథానాయకుడు నటిస్తున్న ఈ చిత్రంలో దర్శకులు సముద్రకని,కే.భాగ్యరాజ్,మొట్టై రాజేంద్రన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారని చెప్పారు. హాస్యభరిత కథా చిత్రంగా తెకెక్కుతున్న ఈ బేబీడాల్ చిత్ర షూటింగ్‌ను ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభించినట్లు హాసిక దత్ వెల్లడించారు.

Comments

Popular posts from this blog

మీ దగ్గర రూటర్ లేకపోయినా మీ లాప్‌టాప్‌లోని ఇంటర్నెట్ ఇలా ఫోన్, టాబ్లెట్లలో వైర్‌లెస్‌గా పొందండి

నేటి వార్తావిశేషాలు నేటి నుంచి గ్రేటర్ హైదరాబాద్ లో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర నేడు కేటీపీఎస్ రెండోదశ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్న కేసీఆర్ నేడు కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన.'జన్మభూమి-మాఊరు' కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం నేడు ఢిల్లీకి వెళ్లనున్న తెలంగాణ ఉన్నతాధికారులు సీఎస్, డీజీపీ నేడు గ్రేటర్ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ భేటీ నేటి నుంచి రెండు రోజులపాటు పశ్చిమ బెంగాల్ లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన ఆప్ నేతలపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వేసిన పరువు నష్టం దావాపై నేటు పాటియాల హౌజ్ కోర్టులో విచారణ

50 లక్షల ఉద్యోగాలు స్వాహా....

తిక్క లెక్క ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రోబోల వాడకం వల్ల లేదా వాటి కృత్రిమ మేధ వల్ల రానున్న 5 ఏళ్లలో దాదాపు 15 దేశాలలో సుమారు 50 లక్షల ఉద్యోగాలు పోనున్నాయని తాజా అధ్యయనం తెలుపుతోంది. దావోస్ (స్విట్జర్లాండ్)లో జరుగుతున్న ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్’ (డబ్ల్యు.ఇ.ఎఫ్) వార్షిక సమావేశాలలో ఆ మేరకు నివేదిక విడుదలైంది. వాస్తవానికి 70 లక్షల ఉద్యోగాలు పోనున్నాయని, అయితే ఈ కృత్రిమ మేధను ఉపయోగంలోకి తేవడానికి అవసరమైన 20 లక్షల కొత్త ఉద్యోగాలు అవసరమైనందుకు స్థూలంగా 50 లక్షల ఉద్యోగాలు పోకతప్పదని నిర్థారిస్తున్నారు. ఉద్యోగం కోల్పోయేవాళ్లలో ఆడవాళ్లే ఎక్కువ శాతం ఉండొచ్చట. సేల్స్, అడ్మినిస్ట్రేషన్, గుమస్తాగిరి వీటిలో ఎక్కువగా ఉండేది మహిళా ఉద్యోగులే కనుక రోబోల వాడకం ఇక్కడే ఎక్కువ కానున్నది కనుక భారీ నష్టం ఆడవారికేనని తాజా హెచ్చరిక. సో... రోబోలకు చిక్కని మేధో ఉపాధి మార్గాలలోకి స్త్రీలు బదిలీ కాకతప్పదేమో.