Skip to main content

హార్రర్ చిత్రంలో మిల్కీబ్యూటీ

హార్రర్ చిత్రంలో మిల్కీబ్యూటీ
దెయ్యం ఈ పదం ఇప్పుడు కోలీవుడ్‌లో కాసుల వర్షం కురిపిస్తోందని చెప్పవచ్చు. ఇక్కడ  హార్రర్ చిత్రాల ట్రెండ్ నడుస్తోందని ప్రత్యేకంగా చెప్పవచ్చు. విభిన్న హార్రర్ కథా చిత్రాల కథలను రెడీ చేసుకుంటున్న దర్శకులు అందులో ప్రముఖ నటీమణుల్ని నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. క్రేజీ నటి నయనతార నటించిన మాయ చిత్రం అనూహ్య విజయం సాధించింది.

  ప్రస్తుతం టాప్ తారామణులు త్రిష, హన్సికల నుంచి రాయ్‌లక్ష్మి,లక్ష్మిమీనన్ వరకు హార్రర్ చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా బాహుబలి చిత్రంలో సౌందర్యరాశిగా ప్రేక్షకులను మతులు పోగొట్టిన నటి తమన్నాను ఇప్పుడు దెయ్యంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.అయితే అలాంటి పాత్రలో ఆమె నటించి భయపెట్టిస్తారా? అన్నదే ప్రశ్న. అసలు విషయానికి వస్తే ఇంతకు ముందు ఆసామి, ఇన్నారుక్కు ఇన్నారెండ్రు చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ఆండాళ్ రమేశ్ తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు.

 ఈయన ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌నే ఫాలో అవుతున్నారు. అయితే ఇది హార్రర్ కథా చిత్రం అయినా ఇప్పటి వరకూ తన కథ తరహా హార్రర్  చిత్రం తమిళ చిత్ర పరిశ్రమలో చూసి ఉండరంటున్నారు. తాను 2012లో దర్శకత్వం వహించిన ఆసామి తమిళ ప్రభుత్వ అవార్డులకు ఎంపికైన 12 చిత్రాల్లో ఒకటిగా చోటు సంపాదించుకుందని తెలిపారు. దొంగస్వాముల మోసాలకు ప్రజలు గురి కావద్దు అన్న సందేశంతో రూపొందించిన చిత్రం అదన్నారు. ఇక ఇప్పడు తెరకెక్కించనున్న చిత్రంలో దెయ్యమే కథానాయకుడని తెలిపారు. కాథానాయికకూ ప్రాముఖ్యత ఉంటుందని చెప్పారు.

 ఆ పాత్రకు నటి తమన్నా అయితే బాగుంటుందని భావించామన్నారు.తనూ ఇంతకు ముందే హార్రర్ కథా చిత్రంలో నటించాలనే ఆసక్తిని వ్యక్తం చేశారని,అందువల్ల తమన్నాతో చర్చలు జరుగుతున్నాయని అన్నారు. ఒకవేళ ఆమె కాల్‌షీట్స్ సర్దుబాటు కాకుంటే నటి రాయ్‌లక్ష్మినిగానీ ఓవియను గానీ నాయకిగా ఎంపిక చేస్తామని దర్శకుడు ఆండాళ్ రమేశ్ అన్నారు. ఇందులో నాజర్, కోవైసరళ, సంతాన భారతి ముఖ్యపాత్రలు పోషించనున్నారని, చిత్ర షూటింగ్ సంక్రాంతి తరువాత ప్రారంభం అవుతుందని తెలిపారు. తమన్నా ప్రస్తుతం తమిళంలో శీను రామసామి దర్శకత్వంలో విజయ్‌సేతుపతికి జంటగా ధర్మదురై చిత్రంలో సక్కని పల్లెటూరి యువతిగా నటిస్తున్నారన్నది గమనార్హం.
 

Comments

Popular posts from this blog

మీ దగ్గర రూటర్ లేకపోయినా మీ లాప్‌టాప్‌లోని ఇంటర్నెట్ ఇలా ఫోన్, టాబ్లెట్లలో వైర్‌లెస్‌గా పొందండి

నేటి వార్తావిశేషాలు నేటి నుంచి గ్రేటర్ హైదరాబాద్ లో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర నేడు కేటీపీఎస్ రెండోదశ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్న కేసీఆర్ నేడు కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన.'జన్మభూమి-మాఊరు' కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం నేడు ఢిల్లీకి వెళ్లనున్న తెలంగాణ ఉన్నతాధికారులు సీఎస్, డీజీపీ నేడు గ్రేటర్ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ భేటీ నేటి నుంచి రెండు రోజులపాటు పశ్చిమ బెంగాల్ లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన ఆప్ నేతలపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వేసిన పరువు నష్టం దావాపై నేటు పాటియాల హౌజ్ కోర్టులో విచారణ

50 లక్షల ఉద్యోగాలు స్వాహా....

తిక్క లెక్క ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రోబోల వాడకం వల్ల లేదా వాటి కృత్రిమ మేధ వల్ల రానున్న 5 ఏళ్లలో దాదాపు 15 దేశాలలో సుమారు 50 లక్షల ఉద్యోగాలు పోనున్నాయని తాజా అధ్యయనం తెలుపుతోంది. దావోస్ (స్విట్జర్లాండ్)లో జరుగుతున్న ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్’ (డబ్ల్యు.ఇ.ఎఫ్) వార్షిక సమావేశాలలో ఆ మేరకు నివేదిక విడుదలైంది. వాస్తవానికి 70 లక్షల ఉద్యోగాలు పోనున్నాయని, అయితే ఈ కృత్రిమ మేధను ఉపయోగంలోకి తేవడానికి అవసరమైన 20 లక్షల కొత్త ఉద్యోగాలు అవసరమైనందుకు స్థూలంగా 50 లక్షల ఉద్యోగాలు పోకతప్పదని నిర్థారిస్తున్నారు. ఉద్యోగం కోల్పోయేవాళ్లలో ఆడవాళ్లే ఎక్కువ శాతం ఉండొచ్చట. సేల్స్, అడ్మినిస్ట్రేషన్, గుమస్తాగిరి వీటిలో ఎక్కువగా ఉండేది మహిళా ఉద్యోగులే కనుక రోబోల వాడకం ఇక్కడే ఎక్కువ కానున్నది కనుక భారీ నష్టం ఆడవారికేనని తాజా హెచ్చరిక. సో... రోబోలకు చిక్కని మేధో ఉపాధి మార్గాలలోకి స్త్రీలు బదిలీ కాకతప్పదేమో.