Skip to main content

సెల్‌ఫోన్‌లో డ్రైవింగ్ లెసైన్స్....?


* వాహన్ బీమా తరహాలో సరికొత్త యాప్
* అన్ని రకాల డాక్యుమెంట్లతో ‘ఎం-వాలెట్’
* త్వరలో ప్రవేశపెట్టనున్న ఆర్టీఏ

సాక్షి, హైదరాబాద్: డ్రైవింగ్ లెసైన్స్, ఆర్‌సీ వెంట తెచ్చుకోవడం మరిచిపోయారా. ట్రాఫిక్ పోలీసులు పట్టుకొని ఫైన్ వేస్తారేమోనని ఆందోళనకు గురవుతున్నారా... ఇక నుంచి ఇలాంటి ఆందోళనలు అవసరం లేదు. జేబులో ఎలాంటి డాక్యుమెంట్లూ లేకపోయినా సరే నిశ్చింతగా రోడ్డెక్కవచ్చు. ట్రాఫిక్ పోలీసులకు, ఆర్టీఏ అధికారులకు బెంబేలెత్తవలసిన పనిలేదు. అయితే అందుకోసం చేయాల్సిందల్లా మీ స్మార్ట్ ఫోన్‌లో గూగుల్ ప్లే నుంచి ఒక మొబైల్ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడమే.

ఆ యాప్ ద్వారా మన డాక్యుమెంట్లను అప్‌డేట్ చేసుకోవడమే. ‘స్మార్ట్’ సేవలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోన్న రవాణా శాఖ త్వరలో ‘ఎం-వాలెట్’ పేరుతో సరికొత్త యాప్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేపట్టింది. ఈ యాప్ ద్వారా వాహనదారులు ఈ-డ్రైవింగ్ లెసైన్స్, ఈ-ఆర్‌సీ, ఈ-ఇన్స్యూరెన్స్, ఈ-పొల్యూషన్ తదితర వాహనానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను ఈ యాప్ ద్వారా పొందవచ్చు.

ఇటీవల ప్రవేశపెట్టిన ‘వాహన్ బీమా’ తరహాలో ఎం-వాలెట్ సేవలందజేస్తుంది. వాహనాల ఇన్సూరెన్స్ వివరాలను, వివిధ బీమా సంస్థలకు సంబంధించిన వివరాలను వాహన్ బీమా ద్వారా పొందవచ్చు. అలాగే ఎం-వాలెట్ కూడా వాహనాల డేటాతో నిక్షిప్తమై ఉంటుంది.

పర్మిట్లు కూడా యాప్‌తోనే...
తెలంగాణ రాష్ర్టవ్యాప్తంగా నమోదైన 80 లక్షల వాహనాలు, 60 లక్షలకు పైగా డ్రైవింగ్ లెసైన్స్‌ల డేటాను రవాణా శాఖ నిక్షిప్తం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 45 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులు, క్యాబ్‌లు, వివిధ రకాల వాహనాలు ఉన్నాయి. 35 లక్షలకు పైగా డ్రైవింగ్ లెసైన్స్‌లున్నాయి. ఈ వివరాలన్నింటినీ రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలోని సెంట్రల్ సర్వర్‌లో నిక్షిప్తం చేశారు. సెంట్రల్ సర్వర్‌ను ‘టీఎస్‌టీడీ’ అనే యాప్‌తో అనుసంధానం చేశారు.

దీంతో అధికారులు తమ సెల్‌ఫోన్‌లోనే వాహనాల వివరాలను పొందే అవకాశం అందుబాటులోకి వచ్చింది. త్వరలో ప్రవేశపెట్టనున్న ‘ఎం-వాలెట్’ను ఈ టీఎస్‌టీడీతో అనుసంధానం చేసి వాహనదారులకు కావలసిన డ్రైవింగ్ లెసైన్స్, ఆర్‌సీ, పొల్యూషన్ సర్టిఫికెట్, ఇన్స్యూరెన్స్ తదితర డాక్యుమెంట్ల వివరాలను అందిస్తారు.

భవిష్యత్తులో రవాణా వాహనాల పర్మిట్లను కూడా ఈ యాప్ ద్వారా అనుసంధానం చేసేందుకు రవాణా శాఖ యోచిస్తోంది. ప్రైవేటు బస్సులు, కాంట్రాక్ట్ క్యారేజీలు, క్యాబ్‌లు, ట్యాక్సీలు, లారీలు తదితర వాహనాలు నేరుగా ఆర్టీఏ కార్యాలయానికి రావలసిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే ఫీజులు చెల్లించి పర్మిట్లను పొందే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రవాణా కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా చెప్పారు.

Comments

Popular posts from this blog

మీ దగ్గర రూటర్ లేకపోయినా మీ లాప్‌టాప్‌లోని ఇంటర్నెట్ ఇలా ఫోన్, టాబ్లెట్లలో వైర్‌లెస్‌గా పొందండి

నేటి వార్తావిశేషాలు నేటి నుంచి గ్రేటర్ హైదరాబాద్ లో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర నేడు కేటీపీఎస్ రెండోదశ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్న కేసీఆర్ నేడు కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన.'జన్మభూమి-మాఊరు' కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం నేడు ఢిల్లీకి వెళ్లనున్న తెలంగాణ ఉన్నతాధికారులు సీఎస్, డీజీపీ నేడు గ్రేటర్ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ భేటీ నేటి నుంచి రెండు రోజులపాటు పశ్చిమ బెంగాల్ లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన ఆప్ నేతలపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వేసిన పరువు నష్టం దావాపై నేటు పాటియాల హౌజ్ కోర్టులో విచారణ

50 లక్షల ఉద్యోగాలు స్వాహా....

తిక్క లెక్క ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రోబోల వాడకం వల్ల లేదా వాటి కృత్రిమ మేధ వల్ల రానున్న 5 ఏళ్లలో దాదాపు 15 దేశాలలో సుమారు 50 లక్షల ఉద్యోగాలు పోనున్నాయని తాజా అధ్యయనం తెలుపుతోంది. దావోస్ (స్విట్జర్లాండ్)లో జరుగుతున్న ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్’ (డబ్ల్యు.ఇ.ఎఫ్) వార్షిక సమావేశాలలో ఆ మేరకు నివేదిక విడుదలైంది. వాస్తవానికి 70 లక్షల ఉద్యోగాలు పోనున్నాయని, అయితే ఈ కృత్రిమ మేధను ఉపయోగంలోకి తేవడానికి అవసరమైన 20 లక్షల కొత్త ఉద్యోగాలు అవసరమైనందుకు స్థూలంగా 50 లక్షల ఉద్యోగాలు పోకతప్పదని నిర్థారిస్తున్నారు. ఉద్యోగం కోల్పోయేవాళ్లలో ఆడవాళ్లే ఎక్కువ శాతం ఉండొచ్చట. సేల్స్, అడ్మినిస్ట్రేషన్, గుమస్తాగిరి వీటిలో ఎక్కువగా ఉండేది మహిళా ఉద్యోగులే కనుక రోబోల వాడకం ఇక్కడే ఎక్కువ కానున్నది కనుక భారీ నష్టం ఆడవారికేనని తాజా హెచ్చరిక. సో... రోబోలకు చిక్కని మేధో ఉపాధి మార్గాలలోకి స్త్రీలు బదిలీ కాకతప్పదేమో.