స్నేక్గ్యాంగ్ కేసులో సంచలన తీర్పు
రూ.5వేల జరిమానా, ఒకరికి 20 నెలల జైలు
నిరసనగా ప్లకార్డులు ప్రదర్శించిన దోషులు
న్యాయస్థానం ఆవరణలో కుటుంబీకుల హంగామా
రూ.5వేల జరిమానా, ఒకరికి 20 నెలల జైలు
నిరసనగా ప్లకార్డులు ప్రదర్శించిన దోషులు
న్యాయస్థానం ఆవరణలో కుటుంబీకుల హంగామా
Visit::page::https://www.facebook.com/freshdeals365 ఎల్బీనగర్/రంగారెడ్డి జిల్లా కోర్టులు, మే 12: విష సర్పాలతో బెదిరించి ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన దోషులకు రంగారెడ్డి జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. సంచలనం సృష్టించిన ఈ స్నేక్ గ్యాంగ్ కేసులో ఏడుగురు దోషులకు యావజ్జీవం పడగా, మరొకరికి 20 నెలల జైలు శిక్ష పడింది. ఈ ఎనిమిదో దోషి ఇప్పటికే 20 నెలలకు పైగా జైలులో ఉన్నందున విడుదల చేయాలని జైళ్ల శాఖకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు తీర్పుపై మహిళలు హర్షం వ్యక్తంచేయగా, దోషుల కుటుంబీకులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టు ఆవరణలో హంగామా చేశారు. స్నేక్ గ్యాంగ్ కేసులో సైబరాబాద్ రెండో మహిళాకోర్టు ఇన్చార్జి జడ్జి వరప్రసాద్ మంగళవారం 8 మందిని దోషులుగా తేల్చడం తెలిసిందే. బుధవారం మధ్యాహ్నం కిక్కిరిసిన కోర్టు హాల్లో జడ్జి వరప్రసాద్ దోషులకు శిక్షలను ఖరారు చేస్తూ తీర్పు చెప్పారు. ఏ1 నుంచి ఏ7 నిందితులకు యావజ్జీవ కారాగారంతో పాటు ఒక్కొక్కరికి రూ.5 వేల జరిమానా విధించారు. ఎనిమిదో నిందితుడు అలీ బారాకబాకు 20 నెలల జైలుతోపాటు రూ.5 వేల జరిమానా వేశారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పొన్నం దేవరాజు కథనం ప్రకారం 2013 జూన్లో పహాడీషరీ్ఫలోని ఓ ఫార్మ్హౌ్సలో వారు ఓ ప్రేమ జంటను నిర్బంధించి పాముతో బెదిరించి అకృత్యాలకు పాల్పడ్డారు. అంతేకాకుండా యువతిని వివస్త్రను చేసి వీడియో తీయడంతోపాటు నగదు, కళ్లజోళ్లు, బంగారు గొలుసు లాక్కున్నారు. వీరిపై పోలీసులు సామూహిక అత్యాచారం, దాడి, దోపిడీ తదితర అభియోగాలు మోపారు. పూర్వాపరాలను పరిశీలించిన జడ్జి వరప్రసాద్ నిందితులను దోషులుగా ఖరారు చేసి యావజ్జీవ శిక్ష విధించారు. సామూహిక అత్యాచారం కింద వారిపై కేసు నమోదు చేసినప్పటికీ, అది రుజువు కాకపోవడంతో బలవంతంగా యువతిని వివస్త్రను చేసి మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన అంశంలో జడ్జి నిందితులను దోషులుగా నిర్ధారించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘‘సభ్య సమాజం తలదించుకునే విధంగా వారి వికృత చేష్టలు ఉన్నాయి. నిందితులు మహిళను క్రూరంగా హింసించారు. దీనికి 23 మంది సాక్షుల్లో 21 మందిని విచారించి జీవిత ఖైదు విధిస్తున్నా’’ అని పేర్కొన్నారు.
తక్కువ శిక్ష విధించండి.. దోషుల మొర
శిక్ష ఖరారుకు ముందు తమకు న్యాయం జరగలేదంటూ దోషులు జడ్జి ముందు వాపోయారు. తాను విదేశాల్లో పనిచేస్తాననీ, గతంలో ఎన్నడూ నేరాలు చేయలేదనీ, తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఏ1 ఫైసల్దయానీ జడ్జికి మొర పెట్టుకున్నాడు. తమపై పోలీసులు తప్పుడు కేసులు బనాయించారని మిగిలిన వారు కోర్టు దృష్టికి తెచ్చారు. వారంతా ప్రమాదకర నిందితులని ప్రాసిక్యూటర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గతంలోనే వారి కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్ నెంబర్లను సమర్పించామన్నారు. కోర్టుకు ఎఫ్ఐఆర్ నంబర్లు కాదనీ, డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుందని ప్రాసిక్యూటర్కు న్యాయమూర్తి చీవాట్లు పెట్టారు. తీర్పుపై మహిళా న్యాయవాదులు, ప్రజా సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. కాగా, తామంతా అమాయకులమనీ, తమకు సరైన న్యాయం జరుగలేదని పేర్కొంటూ దోషులు ప్లకార్డులను ప్రదర్శించారు. సీఎం కేసీఆర్ డౌన్డౌన్ అంటూ అలీబారక్బా నినాదాలు చేశాడు. కేసీఆర్ వల్లే తమ వాళ్లకు జీవితఖైదు విధించారని గట్టిగా అరిచాడు.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more
Join::Group::https://www.facebook.com/groups/freshdeals365
Fallow::https://www.twitter.com/freshdeals365
Post a Comment