రాష్ట్ర విభజన జరిగిన తొలి రెండేళ్లలో తడబాటుకు గురైన చంద్రబాబు ప్రభుత్వం- ఈసారి అనిశ్చితికి తావులేకుండా ప్రణాళికాబద్ధ పంథాను ఎంచుకొంది. సంక్లిష్టమైన ఆర్థిక పరిస్థితుల్లోనూ రూ.1.35 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టి భవిష్యత్తుపై ఆశలు రగిల్చింది. సమైక్యరాష్ట్రంలో నాలుగేళ్ల క్రితం ప్రణాళిక పద్దు కింద కేటాయించిన మొత్తానికి సమానమైన కేటాయింపులను ఈసారీ జరిపి రాష్ట్రం ఆర్థికంగా బలోపేతమవుతోందన్న సందేశాన్ని ఇవ్వగలిగింది. 2016-17 వార్షిక బడ్జెట్ను విత్తమంత్రి యనమల రామకృష్ణుడు గురువారం రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో కొత్త ప్రకటనల జోలికి వెళ్లకుండా ఇప్పటికే ఇచ్చిన హామీలను అమలుచేయడానికే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అయిదుకోట్ల ఆంధ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పోలవరం, రాజధాని నిర్మాణాలకు కేంద్ర బడ్జెట్లో కనిపించిన లోటును పూడ్చేలా రాష్ట్ర ప్రభుత్వం సొంత కేటాయింపులు జరిపి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే ప్రయత్నం చేసింది. కేవలం వీటితోనే సరిపెట్టకుండా అవసరమైతే మరింత మొత్తాన్ని కేటాయించడానికి వెనుకాడబోమని ఆర్థికమంత్రి యనమల ప్రకటించారు. జలవనరుల శాఖకు గత ఏడాది జరిపిన కేటాయింపులకంటే 77% అదనంగా ఖర్చుచేయడమే ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని ఆయన ఉదహరించారుకూడా.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.
Subscribe to:
Post Comments (Atom)
Post a Comment