-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

March 04, 2016

ఈ వయసులోనే...


♦ శ్రీకాకుళం జిల్లాలో విచిత్ర పరిస్థితి
♦ డిపాజిట్లను మించిపోయిన విత్‌డ్రాలు
♦ ఏటీఎంలు ఖాళీ, క్యూ కడుతున్న జనం
♦ మరికొన్నాళ్లు తప్పదంటున్న బ్యాంకర్లు
♦ ఆర్‌బీఐ నుంచి నగదు వస్తేనే పరిస్థితి కొలిక్కి
శ్రీకాకుళం: జేబులో డబ్బులు లేకపోవటం చూశాం. చేతిలో చిల్లిగవ్వ లేదనటం విన్నాం. కానీ బ్యాంకులో డబ్బు లేదనటం ఎక్కడైనా చూశారా? ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఇదే జరుగుతోంది. ఒక్క బ్యాంకు కాదు... ఒక బ్రాంచి కాదు. దాదాపు అన్ని బ్యాంకుల్లోనూ ఇదే పరిస్థితి. ఇక ఏటీఎంల సంగతైతే చెప్పనక్కర్లేదు. ప్రతి ఏటీఎం ముందూ జనాల బారులే. ఎంత లైన్లున్నా చాలా చోట్ల ఖాళీ ఏటీఎంలే కనిపిస్తున్నాయి. దీనికి కారణమేంటంటే చెల్లింపులకు సరిపడా డిపాజిట్లు లేవు.
పెపైచ్చు ఫిబ్రవరి నెలలో విత్‌డ్రాయల్స్ విలువ చాలా ఎక్కువగా ఉంది. పక్షం రోజులుగా జిల్లా వ్యాప్తంగా జాతరలు, తీర్థాలతో పాటు వివాహాలూ భారీగా జరుగుతుండటంతో ఏటీఎంల వద్ద జనం డబ్బు కోసం క్యూ కడుతున్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ఇవ్వాల్సిన పేమెంట్లు కూడా జిల్లా వ్యాప్తంగా ఒకేసారి ఇవ్వాల్సి రావడం విత్‌డ్రాయల్స్ అధికమయ్యాయి. డబ్బు తీసుకున్న కొనుగోలుదారులు వాటిని ఇతర ప్రాంతాల్లో జమ చేస్తుండటం, స్థానికంగా డిపాజిట్లు తగ్గటం వంటివి పరిస్థితికి ఆజ్యం పోస్తున్నాయి.
 రెండు వారాల నుంచీ ఇదే పరిస్థితి...
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 281 బ్యాంకులు, 240 వరకు ఏటీఎం సెంటర్లు ఉన్నాయి. బ్యాంకును బట్టి ఒక్కో ఏటీఎంలో వారం నుంచి నెలరోజుల వ్యవధిలో కనీసం రూ.10 నుంచి 20 లక్షల వరకు పెడుతుంటారు. ఖరీఫ్ చివర్లో మొదలైన ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఫిభ్రవరి 15 నుంచి చెల్లింపులు జరుగుతున్నాయి. నెలాఖరు నాటికి సుమారు రూ.150 కోట్ల అవహై-బీపీ.. మందులు వాడాలా?

హోమియో కౌన్సెలింగ్
నా వయసు 28. పెళ్లయి, మూడేళ్లయింది. ఇంకా సంతానం లేదు. బహిష్టు సమయంలో విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్ దగ్గరకు వెళితే నాకు డిస్మనోరియా అని చెప్పి కొన్ని మందులు ఇచ్చారు. అదేమైనా ప్రమాదకరమైన జబ్బా? దీనికి హోమియోలో చికిత్స ఉందా?
 - బి.శ్రీదేవి, రాజమండ్రి
 స్త్రీల ఆరోగ్యసమస్యలలో నెలసరి సమస్యలు ముఖ్యమైనవి. ఎక్కువశాతం స్త్రీలు పిరియడ్స్ సమయంలో పొత్తి కడుపులో నొప్పితో బాధపడుతుంటారు. దీనిని బహిష్టునొప్పి (డిస్మనోరియా) అంటారు. డిస్మనోరియా అన్ని వయసులలోని వారికీ ఉండే సమస్యే అయినప్పటికీ యుక్తవయస్కులలో ఎక్కువ.

లక్షణాలు: డిస్మనోరియా ముఖ్యంగా మూడు రకాలు. మొదటిరకంలో బహిష్టుకు మూడు నుంచి ఐదురోజుల ముందు నుంచే పొత్తికడుపు, నడుము భాగంలో నొప్పి మొదలవుతుంది. ఇది రుతుస్రావం మొదలయ్యాక మందులు వాడినా, వాడకున్నా తగ్గిపోతుంది. దీనిని కంజెస్టివ్ డిస్మనోరియా అంటారు. రెండవ రకంలో తీవ్రమైన నొప్పి, వాంతులు, శరీరం వణకడం, తలతిరగడం వంటి లక్షణాలు కనపడవచ్చు. దీనిని స్పాస్మోడిక్ డిస్మనోరియా అంటారు. మూడవరకంలో విపరీతంగా నొప్పి, రక్తస్రావంలో పెద్దపెద్ద గడ్డలు ఉంటాయి. దీనిని మెంబ్రేనస్ డిస్మనోరియా అంటారు.

కారణాలు: గర్భాశయం చుట్టూ ఉన్న కండరాల్లో సరైన సంకోచ వ్యాకోచాలు జరగకపోవడం, గర్భాశయం ముఖద్వారం చిన్నదిగా లేదా ముడుచుకుని ఉండటం వల్ల స్రావం సాఫీగా జరగక నొప్పి వస్తుంది. కొందరిలో యోని ముఖద్వారం చిన్నదిగా ఉండటం వల్ల స్రావం సరిగ్గా బయటకు రాక చిన్నచిన్న గడ్డల రూపంలో రుతుస్రావం వెలువడి నొప్పి వస్తుంది. గర్భాశయం ఆకృతిలోనూ, పరిమాణంలోనూ  తేడాలవల్ల, గర్భాశయం వెనుకకు తిరిగి ఉండటం వల్ల, గర్భాశయంలో గడ్డలుండటం, చీము చేరడం, అండాశయంలో కంతులు పెరగడం, గర్భనిరోధక ఔషధాల సేవనం, గర్భనిరోధక పద్ధతులను పాటించడం, మానసిక ఆందోళన, హార్మోన్ల అసమతౌల్యతల వల్ల కూడా నొప్పి కలిగే అవకాశాలు ఉంటాయి.

హోమియో చికిత్స: పాటిజివ్ హోమియోపతిలో కాన్‌స్టిట్యూషన్ పద్ధతిలో మీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

డాక్టర్ ఎ.ఎం. రెడ్డి
సీనియర్ డాక్టర్
పాజిటివ్ హోమియోపతి
హైదరాబాద్

కిడ్నీ కౌన్సెలింగ్
నా వయసు 33 ఏళ్లు. నాకు ఎలాంటి ఇబ్బందులూ లేవు గానీ... ఈ మధ్య జ్వరం వచ్చింది. డాక్టర్‌ను సంప్రదించినప్పుడు ఆయన పరీక్షలు చేశారు. అప్పుడు నా బీపీ 170/120 ఉందనీ, మందులు వాడాలని చెప్పారు. మందులు వాడకుండా ఉంటే భవిష్యత్తులో ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందా?                                    
  - సత్యనారాయణ, విజయవాడ
 మీ వయసు వారికి ఏ కారణం లేకుండా హైపర్‌టెన్షన్ (బీపీ సమస్య) రావడం చాలా అరుదు. కానీ నలభై ఏళ్లలోపు బీపీ ఇంత ఎక్కువగా ఉంటే మూత్రపిండాలకు (కిడ్నీలకు) సంబంధించిన సమస్య ఏదైనా ఉందా అని చూడాలి. దీనికోసం ఒకసారి మూత్రపరీక్ష, అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కానింగ్, క్రియాటినిన్ వంటి పరీక్షలతో పాటు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి, అవసరమైన ఇతర పరీక్షలూ చేయించుకోండి. వాటి ద్వారా అసలు మీకు బీపీ అంతగా పెరగడానికి కారణాలు తెలుసుకోవాలి. బయటకు కనిపించేలా ఏ లక్షణాలూ లేనప్పటికీ బీపీ మందులు తప్పనిసరిగా వాడాలి. లేకపోతే భవిష్యత్తులో కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంది. అంతేగాక... ఆహారంలో ఉప్పు చాలా తగ్గించి వాడటం అవసరం. ఇక స్థూలకాయం ఎక్కువగా ఉన్నవాళ్లు బరువు తగ్గించుకోవాలి. పొగతాగే అలవాటు ఉంటే తక్షణం మానేయండి.

నా వయసు 25 ఏళ్లు. రెండేళ్లుగా అప్పుడుప్పుడూ మూత్రం ఎరుపు రంగులో వస్తోంది ఇలా రెండు నుంచి మూడు రోజుల పాటు వస్తోంది. ఆ తర్వాత తగ్గిపోతోంది. నొప్పి లేకపోవడంతో ఇంతవరకూ పట్టించుకోలేదు. దీని వల్ల కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందా?                                               - విశ్వప్రసాద్, కందుకూరు
 సాధారణంగా కిడ్నీలో రాళ్లు, ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల కొందరికి ఇలాంటి సమస్య రావచ్చు. మీరు ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్, యూరిన్ ఎగ్జామినేషన్ వంటి పరీక్షలు చేయించాలి. దాంతో మీ సమస్యకు అసలు కారణం ఏమై ఉంటుందో తెలుస్తుంది. అందుకే మీరు ఒకసారి డాక్టర్‌ను  కలవడం మంచిది. సమస్య నిర్ధారణ అయితే దానికి తగిన మందులు వాడవచ్చు. మీకు సాధారణ ఇన్ఫెక్షన్ ఉంటే అది మామూలు యాంటీబయాటిక్ మందులతోనే తగ్గిపోతుంది. మీరు ఒకసారి యూరిన్‌లో ప్రోటీన్లు పోతున్నాయా అనే విషయాన్ని తెలుసుకునే పరీక్షలూ చేయించాలి.

డాక్టర్ విక్రాంత్‌రెడ్డి
కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్,
కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్

లివర్ కౌన్సెలింగ్

నా వయసు 65 ఏళ్లు. కీళ్ల నొప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయి. నా సమస్యకు  పరిష్కారం చెప్పండి.
 - శ్రీనాధరావు, కమలాపురం
 కీళ్ల నొప్పులలో చాలా రకాలు ఉన్నాయి. ఎముకలూ, దానిపైన రక్షణగా ఉండే చిగురు ఎముక (కార్టిలేజ్) అరగడం వల్ల కీళ్లనొప్పులు, వాపు వస్తాయి. ఈ కండిషన్‌ను ఆర్థరైటిస్ అంటారు. ఈ రకాలలో ఇప్పటికి వందకు పైగా గుర్తించారు. తమ రోగ నిరోధక వ్యవస్థే తమ ఎముకలపై ప్రతికూలంగా వ్యవహరిస్తుంది. ఈ సమస్యను ‘రుమటాయిడ్ ఆర్థరైటిస్’ అంటారు. ఒక్కోసారి ఏదైనా ప్రమాదంలో గాయపడినా, బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్ల తర్వాత కూడా ఆర్థరైటిస్ రావచ్చు. మీకు ఏదైనా ప్రమాదం జరిగిందా లేక ఏవైనా జబ్బు వచ్చి తగ్గాక ఈ పరిణామం సంభవించిందా అన్న వివరాలు లేవు. ఇక ఆర్థరైటిస్ ఉన్నవారిలో కీళ్లు నొప్పిగా ఉండటంతో పాటు, ఆ ప్రాంతం ఎర్రబారడం, వేడిగా అనిపించడం, బిగుతుగా అనిపించడం వంటి లక్షణాలూ కనిపించవచ్చు. మీ వయసులో ఉన్నవారికి ఆర్థరైటిస్ మామూలే అయినా ఇప్పుడు అన్ని వయసుల వాళ్లలోనూ (పిల్లల్లోనూ) ఇది కనిపిస్తోంది. మహిళల్లో మరీ ఎక్కువ. (మహిళల్లో 24.3 శాతం ఆర్థరైటిస్‌తో బాధపడుతుంటే పురుషుల్లో ఇది 18.7 శాతం మాత్రమే). ఇక స్థూలకాయం కూడా ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలను మరింత పెంచుతుంది. నివారణ: ఆర్థరైటిస్‌ను నివారించడానికి ముందు నుంచే అన్ని కీళ్లూ చురుగ్గా కదిలేలా వాకింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. దీనివల్ల కీళ్లతో పాటు శరీర సంపూర్ణ ఆరోగ్యమూ మెరుగుపడుతుంది. రోజుకు కనీసం 30 నిమిషాలకు తగ్గకుండా వ్యాయామం చేయాలి. వారంలో మీరు వ్యాయామం చేసిన సమయం కనీసం 150 నిమిషాలకు తగ్గకుండా జాగ్రత్త తీసుకోవాలి. అయితే ఇక్కడ శరీరం సహకరిస్తున్నంత  వ్యాయామమే చేయాలి తప్ప... దాన్ని తీవ్రమైన శ్రమకు గురిచేసేలా మీ ఎక్సర్‌సైజ్ ఉండకూడదు. బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమస్యకు ఎన్‌ఎస్‌ఏఐడీ, డీఎమ్‌ఏఆర్‌డీ, బయాలాజిక్ రెస్పాన్సెస్ అనే మందులు అందుబాటులో ఉన్నాయి. ఇక మీరు ఒకసారి మీ ఫిజిషియన్‌ను లేదా ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలిసి, అవసరమైన పరీక్షలు చేయించుకొని తగిన  చికిత్స తీసుకోండి.

డాక్టర్ ప్రవీణ్ రావు
సీనియర్ ఆర్థోపెడిక్ - జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్
యశోద హాస్పిటల్స్
సికింద్రాబాద్సరం వచ్చింది. ఫిబ్రవరిలో ఫించన్ల చెల్లింపులు రూ.30 కోట్ల మేర జరిగాయి. ట్రెజరీల నుంచి వచ్చే బిల్లుల ఆధారంగా జీతాలకూ కనీసం రూ.20 నుంచి రూ.30 కోట్లు కావాలి. వివిధ ప్రాంతాల నుంచి బ్యాంకులకు రావాల్సిన మొత్తాలు ఆన్‌లైన్‌లోనే వస్తుంటాయి. పేమెంట్ల మొత్తాన్ని, డిపాజిట్ల మొత్తాన్ని సగటున లెక్కించి సొమ్ము అవసరమైన పక్షంలో ఇతర జిల్లాల నుంచి తెప్పిస్తున్నారు.
అలా ఒక్క ఫిబ్రవరిలోనే విజయవాడ నుంచి ఎస్‌బీఐ సుమారు 80 కోట్ల రూపాయలు తెప్పించింది. ఆ మొత్తాన్ని 50-80 ఏటీఎంలలో సర్దేసరికి ఖాళీ అయిపోయింది. రోజుకు జిల్లా వ్యాప్తంగా ఒక్క ఎస్‌బీఐలోనే రూ.10 కోట్ల డిపాజిట్లు ఉంటున్నాయి. కారణాలు తెలియరాలేదు గానీ... ఫిబ్రవరిలో ఈ మొత్తం తగ్గింది. దీంతో క్యాష్ కోసం జనం కిటకిటలాడాల్సి వచ్చింది. కొన్నాళ్లుగా ఇదే పరిస్థితి ఉన్నా... ఫిబ్రవరిలో మరీ ఎక్కువయింది. శివారు ప్రాంతాల ఏటీఎంలలోనూ రద్దీ కని పించింది.  ప్రైవేట్ బ్యాంకులు, ఏటీఎంల పరిస్థితీ అంతే. ఇతర బ్యాంకులపై ఎస్‌బీఐ ఆధారపడినా... అది కొంతవరకే ఉపయోగపడింది.
 ఆర్‌బీఐ నుంచి నిధులు రాకపోవడమే...
నగదుకు కొరత వస్తే బ్యాంకులు ఆర్‌బీఐ నుంచి తెప్పిస్తుంటాయి. చెల్లింపులకు సరిపడా డిపాజిట్లు లేకపోయినా, తక్కువ చెల్లింపులు, ఎక్కువ పేమెంట్ల సమయంలో తమకు నిధులు అవసరమంటూ లేఖలు రాస్తాయి. ఒక్క ఫిబ్రవరి నెలలో ఆంధ్రాబ్యాంకు రూ.40 నుంచి రూ.50 కోట్ల కోసం రిక్వెస్ట్ లెటర్లు పంపింది. ఎస్‌బీఐ కూడా రూ.100 కోట్లు కావాలని కోరింది. సమయానికి ఆర్‌బీఐ నుంచి డబ్బులు రాకపోవడంతో బ్యాంకులు చేతులెత్తేశాయి.
ఎస్‌బీఐ ఏటీఎంలలో నిత్యం రూ.8 కోట్లు పెడుతుంటామని, ఈ సారి పూర్తి స్థాయిలో ఖాళీ అయిపోవడం, బ్యాంకు వద్ద డబ్బు లేకపోవడంతో ఆర్‌బీఐపైనే ఆధారపడాల్సి వచ్చిందని ఎస్‌బీఐ రీజినల్ మేనేజర్ మేరీ సగయా ‘సాక్షి’కి చెప్పారు. మార్చి మొదటి వారంలో ఆర్‌బీఐ నుంచి నిధులొస్తాయని, పరిస్థితి సర్దుమణుగుతుందని ఆమె చెప్పారు. ‘‘ప్రైవేట్ బ్యాంకుల నుంచి తీసుకున్న మొత్తాల్ని ఏటీఎంలలో సర్దాం. కొన్నాళ్లుగా నగదుకు ఇబ్బంది ఉన్న మాట నిజమే’’ అన్నారామె. కాగా  జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో ఇదే పరిస్థితి ఉంద ని, దీన్ని ఆర్‌బీఐ దృష్టికి తీసుకెళ్ళామని లీడ్ బ్యాంకు మేనేజరు ఎల్.రామిరెడ్డి చెప్పారు. త్వరలోనే సమస్య నుంచి బయటపడతామన్నారు.


When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu