-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

February 09, 2016

పెళ్లి ఫొటోల్లో.. పిచ్చి పీక్స్...!


పెళ్లి ఫొటోలను ఆయా ఫొటోగ్రాఫర్లు రకరకాల యాంగిల్స్‌లో తీస్తుంటారు. ఇందుకోసం వాళ్లు రకరకాల కష్టాలు పడుతుంటారు. సమయానికి లైటింగ్ సరిగ్గా ఉండాలి, తాము అనుకున్న ఫ్రేము సరిగ్గా రావాలి, అంతా చేసి ఫొటో తీశాక వధూవరుల్లో ఒకళ్లు కళ్లు మూయడమో, లేదా వేరేవైపు చూడటమో జరుగుతుంది. అందులోనూ ఇప్పుడు డిజిటల్ ఆల్బంలు వచ్చిన తర్వాత.. చిత్ర విచిత్రమైన యాంగిల్స్‌లో ఫొటోలు తీస్తూ.. వాటిని ఆ తర్వాత వధూవరులకు కానుకగా అందిస్తున్నారు. ఇందుకోసం పెళ్లి తంతు మొత్తం ముగిసిన తర్వాత.. వధూవరులను మాత్రమే ఒకచోట ఉంచి వాళ్లను రకరకాలుగా ఫొటోలు తీస్తున్నారు.

సరిగ్గా అలాంటి ఫొటో ఒకదాన్ని హీరో నిఖిల్ సిద్దార్థ ట్వీట్ చేశాడు. వధూవరులిద్దరూ ఎదురెదురుగా ఉండి చేతులు పట్టుకుని ఉండగా.. ఫొటోగ్రాఫర్ వాళ్లిద్దరి మధ్య కింద పడుకుని సరిగ్గా ఆ చేతుల కిందకు తన కెమెరా వచ్చేలా ఉన్నాడు. ఆ ఫొటోను ట్వీట్ చేస్తూ.. 'వెడ్డింగ్ ఫొటోల పిచ్చి పీక్స్'  అని కామెంట్ పెట్టాడు. ఆ ట్వీట్‌ను మరో హీరో దగ్గుబాటి రానా కూడా రీట్వీట్ చేశాడు.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu