చిత్తూరు జిల్లా: ప్రేమించాడని నమ్మితే విషనాగై కాటేశాడు..నమ్మి వెంటవచ్చిన యువతిని నయవంచన చేసి ప్రాణాలు తీశాడు. ఈ విషయం బయటికి పొక్కకుండా తన ఇంట్లోనే పాతిపెట్టాడు. ప్రేమ ముసుగులో ఓ కిరాతకుడు చేసిన హత్య చిత్తూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రెండు నెలల క్రితం నారాయణ రెడ్డి సబీహాకు పరిచయమయ్యాడు. మూడునాళ్లకే ప్రియురాలిపై అనుమానం వచ్చిన దుండగుడు ఆమె పాలిట కాలయముడయ్యాడు.
సబీహా తల్లి ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ప్రియుడే నిందితుడని తేల్చేశారు. చరిగొండలోని తన ఇంట్లో సబీహా మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు ప్రియుడు నారాయణరెడ్డి ఒప్పుకున్నాడు. సబీహా మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. జనవరి 29న తిరుపతిలో సబీహాను చంపినట్లు నారాయణరెడ్డి ఒప్పుకున్నాడు. కాగా అనుమానంతోనే హత్యచేశానని పోలీసులకు ఆ నయవంచకుడు తెలిపాడు.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.
Post a Comment