-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

February 16, 2016

బ్యాంకులో భారీ చోరీ 70 తులాలు దొంగిలించినట్లు ప్రాథమిక అంచనా



రాజధాని శివారులోని ఓ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. రెండు రోజులు(శని, ఆదివారాలు) సెలవులు రావడంతో దొంగల ముఠా పకడ్బందీగా వ్యూహాన్ని రచించి లాకర్లలోని బంగారాన్ని అపహరించింది. రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌ పట్టణంలోని ఆంధ్రా బ్యాంక్‌లో ఇది చోటుచేసుకుంది. సోమవారం ఉదయం బ్యాంకు తెరిచిన సిబ్బంది.. అప్పటికే లాకర్లు ధ్వంసమై ఉండటాన్ని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది. ప్రాథమిక అంచనా మేరకు ఖాతాదారులకు చెందిన 70తులాల వరకు తాకట్టు బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు చెబుతున్నా.. 4-5 కిలోల వరకు దుండగులు ఎత్తుకెళ్లి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సోమవారం సాయంత్రం వరకూ బ్యాంకు సిబ్బంది ఎంత బంగారం చోరీ అయి ఉంటుందనేది తేల్చలేకపోయారు.
వెంటిలేటర్‌ వూచలను తొలిగించి..: బ్యాంకు వెనకభాగంలో ఉన్న ఓ కళాశాల భవనంలోకి ప్రవేశించిన దొంగలు వెంటిలేటర్‌కున్న ఇనుప వూచలను సెంట్రింగ్‌ కట్టర్‌తో కత్తిరించి బ్యాంకులోకి ప్రవేశించినట్లు గుర్తించారు. హాలులోని గ్రిల్‌ ద్వారం తాళాలను కట్‌చేసి లాకర్‌ గదిలోకి ప్రవేశించారు. అందులో నాలుగు లాకర్‌ చెస్ట్‌(అరలుతో కూడిన బీరువాలు)లుండగా..ఖాతాదారుల బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టిన లాకర్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించి విఫలం కావడంతో..పైభాగాన్ని కట్టర్‌తో కత్తిరించి అందినకాడికి దోచుకెళ్లారు. దాదాపు 180 మంది వరకు ఖాతాదారులు బంగారాన్ని తాకట్టు పెట్టగా..82 కవర్లలో ఉన్న సొత్తును అపహరించినట్లు అంచనా వేస్తున్నారు. సోమవారం ఉదయం బ్యాంకు తెరిచిన మేనేజర్‌ మల్లికార్జున శర్మ చోరీ జరిగిందని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు వద్ద కాపలాదారు లేకపోవడం.. పటిష్ఠమైన లాకర్లను ఏర్పాటు చేసుకోపోవడంతోనే దుండగుల పని సులువైందని పోలీసులు పేర్కొంటున్నారు.

ఆధారాలు ధ్వంసం..: చోరీ సమయంలో తమకు సంబంధించిన ఆధారాలు దొరక్కుడా దుండగులు జాగ్రత్తలు తీసుకున్నారు. బ్యాంక్‌ లోపల ఉన్న సీసీ కెమెరాలకు చెందిన డిజిటల్‌ వీడియో రికార్డు బాక్సుల్ని తమ వెంట తీసుకెళ్లారు. అలారం వ్యవస్థను ధ్వంసం చేశారు. డాగ్‌స్క్వాడ్‌ ఆనవాళ్లను గుర్తించకుండా బ్యాంక్‌ లోపల పలుచోట్ల కారంపొడి చల్లారు. అయితే బ్యాంకులో లభించిన వేలిముద్రల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బ్యాంక్‌ను మల్కాజిగిరి డీసీపీ రామచంద్రారెడ్డి, ఏసీపీ రవిచందర్‌రెడ్డి సందర్శించారు. దొంగలను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు మీడియాకు తెలిపారు.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu